వైసిపి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఇటీవల ఉత్తరాంధ్ర రక్షణ చర్చావేదికలో తెలుగుదేశం పార్టీ నాయకులు దద్దమ్మల మాట్లాడారని విమర్శించారు.
సమావేశం మొత్తం చూస్తే తెలుగుదేశం పార్టీ భజన సమావేశం మాదిరిగా ఉందని వైసిపి ఎమ్మెల్యే అమర్నాథ్ విమర్శించారు.మొత్తం ఉత్తరాంధ్ర అన్ని అభివృద్ధి చేయకుండా నాశనం చేసి ప్రస్తుతం రక్షిస్తున్నటు టిడిపి నాయకులు మాటలు ఉన్నాయని అన్నారు.
ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు విశాఖపట్నాన్ని పాలక రాజధానిగాఒప్పుకున్నారా లేదా అనేది స్పష్టం చేయాలని క్లారిటీ ఇవ్వాలని కోరారు.అంతమాత్రమే కాకుండా విశాఖపట్టణానికి కాకుండా తెలుగుదేశం పార్టీ అమరావతిని ఎందుకు రాజధానిగా చేసిందో కూడా తెలియ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
ఎవరు ఏమనుకున్నా రాబోయే రోజుల్లో విశాఖ పాలన రాజధానిగా మారుతున్నట్లు పేర్కొన్న ఎమ్మెల్యే అమర్ నాథ్ఉ త్తరాంధ్ర అభివృద్ధి విషయంలో చర్చకు వైసిపి రెడీ తెలుగుదేశం పార్టీ రెడీయేనా అంటూ సవాల్ విసిరారు.