కాబూల్ విమానాశ్రయం వద్ద ఐసిస్ ఉగ్రవాదులు చేసిన దాడులలో అమెరికా దేశానికి చెందిన 13 మంది సైనికులు చనిపోవటం తెలిసిందే.ఈ క్రమంలో ఐసిస్ ఉగ్రవాదుల దాడులను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు జో బైడేన్ కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటా మని వేటాడి వెంటాడి మరీ చంపటం జరుగుతుందని వార్నింగ్ ఇవ్వటం తెలిసిందే.
ఈ క్రమంలో తాజాగా ఐసిస్ ఉగ్రవాదుల నాయకులను లక్ష్యంగా చేసుకుని అమెరికా సరికొత్తగా అధికారం తీర్చుకోవడానికి రెడీ అయింది.
ఐసిస్ నాయకులను లక్ష్యంగా చేసుకుని… వారి స్థావరాలు ఉండేచోట డ్రోన్ దాడులకు పాల్పడుతున్నట్లు స్పష్టం చేయడం జరిగింది.ఐసిస్ నేతలే లక్ష్యంగా దాడులు చేస్తున్నట్లు అమెరికా ప్రకటన చేయడం జరిగింది.ఈ క్రమంలో విమానాశ్రయం గేట్ల వద్ద అమెరికా పౌరులు ఎవరూ ఉండకూడదని తాజాగా ప్రకటన చేయడం జరిగింది.
మరోపక్క కాబూల్ విమానాశ్రయం వద్ద ఐసిస్ చేసిన దాడులలో మృతుల సంఖ్య 182 కు చేరుకుంది.ఆఫ్ఘనిస్థాన్లో డ్రోన్ దాడులు చేస్తున్నట్లు పెంటగాన్ తాజాగా ప్రకటించడంతో.ప్రపంచవ్యాప్తంగా ఈ న్యూస్ సంచలనంగా మారింది.