సినీ ఇండస్ట్రీలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ హీరోకు ఎక్కువగా ఉందంటే చాలా మంది టక్కున చెప్పే పేరు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకూ చాలా మంది హీరోలు వచ్చారు.
ప్రస్తుతం తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఒక పెద్దదిక్కుగా మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు.ఇకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.
అన్నకు తగ్గ తమ్ముడిగా అరంగేట్రం చేసి తనను తాను నిరూపించుకున్నాడు.ప్రస్తుతం అటు సినిమాలు చేస్తూనే.
ఇటు రాజకీయాల్లో బిజీగా గడుపుతున్నాడు.మెగా ఫ్యామిలీకి ఎటువంటి ఆపద వచ్చినా ఫ్యాన్స్ ఊరుకోరు.
ఈ మధ్య కొంత కాలం క్రితం మెగాస్టార్ చిరంజీవికి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కరోనా రావడంతో అభిమానులు ఆందోళన చెందారు.ఆ సమయంలో వారికి కరోనా త్వరగా తగ్గిపోవాలని పూజలు చేశారు.
వివిధ కార్యక్రమాలు నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.ఆ సమయంలో వారికి ఆరోగ్యం గురించి ఆందోళన చెందినటువంటి ఒక అభిమాని వారి ఆరోగ్యం బాగుండాలని తిరుపతి నుంచి జగిత్యాలకు సైకిల్ యాత్ర చేశాడు.
జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి సైకిల్ యాత్రను చేసి అతను తన అభిమానాన్ని చాటుకోవడం విశేషం.చిత్తూరు జిల్లాలోని రామచంద్రాపురం మండలంలో మెగా ఫ్యాన్స్ చాలా మందే ఉన్నారు.బలిజపల్లి గ్రామంలోని ఈశ్వర్ రాయల్ మెగాస్టార్ చిరంజీవికి ఓ పెద్ద అభిమాని.అటువంటి మెగా కుటుంబంలో చిరంజీవి, పవన్ కరోనా బారిన పడటంతో వారు బాగుండాలని ఆ దేవున్ని వేడుకున్నాడు.
వారిద్దరి ఆరోగ్యం బాగుండాలని ఈనెల పదో తేదీన తిరుపతి శ్రీవారి ఆలయం నుంచి సైకిల్ యాత్రను మొదలు పెట్టాడు.దాదాపుగా 1200 కిలోమీటర్ల సైకిల్ యాత్రను దిగ్విజయంగా పూర్తి చేశాడు.
కొండగట్టు అంజన్నను దర్శనం చేసుకుని తన మొక్కును తీర్చుకున్నాడు.