ఏ తల్లిదండ్రులకు అయినా వారి పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లలు పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్దవారయ్యే వరకూ వారిని కంటికి రెప్పలా కాపాడుతూ చూసుకుంటారు.
వారి భవిష్యత్తు కోసం అహర్నిశలూ కష్టపడతారు.కష్టాలు పడకుండా సంతోషకర జీవితాన్ని గడిపేందుకు వారికి అనేక సదుపాయాలను కల్పిస్తారు.
మరి అటువంటి బిడ్డలు ఎదిగిన తర్వాత ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రులను చూసుకుంటే వారికి పట్టరానంత ఆనందం కలుగుతుంది.తమ పిల్లలు స్థిరపడితే ఇక వారి సంతోషం మాటల్లో చెప్పలేనిది.
ఏ తల్లిదండ్రులకైనా పిల్లలు ప్రయోజకులు అవ్వడమే ముఖ్యం.తమ బిడ్డలు తమపై అధికారి అయితే ఇక వారి సంతోషం అంతా ఇంతా కాదు.
గతంలో కూడా ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.గతంలో పోలీసు శాఖలో ఓ ఉన్నతాధికారిగా కూతురు ఉంటే తన కింది స్థాయి ఉద్యోగిగా తండ్రి సెల్యూట్ చేసిన ఘటన సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.
తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది.
ఒక తల్లి తన బిడ్డకు సెల్యూట్ చేసింది.
తన కొడుకు ఉన్నతాధికారిగా అక్కడికి రావడంతో ఆమె సెల్యూట్ చేసింది.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
గుజరాత్ రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది.అరవల్లిలో డిఎస్పీగా విశాలల్ రబని పని చేస్తున్నాడు.
ఆయన తల్లి అయిన మధుబెన్ రబని ఆ ఊర్లోనే అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తోంది.ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆ కార్యక్రమానికి వారిద్దరూ హాజరుకావాల్సి వచ్చింది.
కార్యక్రమంలో భాగంగా డిఎస్పీకి గౌరవ వందనం చేయాలి.ఆ టైంలో మధుబెన్ రబని అక్కడే ఉండటంతో తన కొడుకైన డిఎస్పీకి సెల్యూట్ చేసి మురిసిపోయింది.
ఆ సమయంలో తీసిన ఫోటోను గుజరాత్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ దినేశ్ దాస సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఆ ఫోటో కాస్త వైరల్ అయ్యింది.