సినిమా, టీవీ రంగానికి చెందిన సెలబ్రిటీలకు భారీ మొత్తంలో పారితోషికాలు ఉంటాయనే సంగతి తెలిసిందే.అయితే వేర్వేరు కారణాల వల్ల కొంతమంది నటీనటులు ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంటున్నారు.2015 సంవత్సరంలో థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న సినిమాలలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన భజరంగీ భాయిజాన్ కూడా ఒకటి.విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందించగా భారత్, పాక్ మధ్య కథాంశంతో ఈ మూవీ తెరకెక్కింది.
ఈ సినిమాలో సునీత శిరోల్ అనే నటి కీలక పాత్రలో నటించారు.ఈ నటి వయస్సు ప్రస్తుతం 85 సంవత్సరాలు కాగా ఈ నటిని అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి.
సునీత శిరోల్ కిడ్నీ ఇన్ఫెక్షన్ తో పాటు ఇతర సమస్యలతో బాధ పడుతున్నారు.సునీత శిరోల్ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోయినా బాలీవుడ్ ప్రేక్షకులకు సినిమాల ద్వారా సీరియల్స్ ద్వారా పరిచయం ఉన్న నటి కావడం గమనార్హం.
కరోనా ఫస్ట్ వేవ్ ముందువరకు తాను సినిమాలతో పాటు సీరియళ్లకు పని చేశానని ప్రస్తుతం నెలకొన్న అనారోగ్య సమస్యల వల్ల పెళ్లి తర్వాత సినీ పరిశ్రమలో కొనసాగడం సాధ్యం కాదని ఆమె అన్నారు.
కరోనా సమయంలో తాను దాచుకున్న మొత్తం ఖర్చైందని సునీత పేర్కొన్నారు.మోకాలి నొప్పితో తాను ఎంతగానో బాధ పడుతున్నానని సునీత వెల్లడించారు.మూడు నెలలుగా తాను అద్దె కూడా చెల్లించలేకపోతున్నానని ఆమె పేర్కొన్నారు.
తన కాళ్లపై తను నిలబడేంత వరకు ఆర్థిక సహాయం కావాలని ఆమె అన్నారు.తాను సంపాదించిన డబ్బులో ఎక్కువమొత్తం భర్తతో కలిసి ఇన్వెస్ట్ చేశానని అయితే వ్యాపారంలో నష్టం వచ్చిందని ఆమె చెప్పారు.
బ్రతకడం చాలా కష్టంగా ఉందని సునీత శిరోమ్ భావోద్వేగానికి గురయ్యారు.