తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి లీడర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు రానా ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి ప్రస్తుతం స్టార్ హీరో స్థాయిలో ఉన్నారు.ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి రానా సరికొత్తగా ముగ్గురు ముద్దుగుమ్మలకు వెల్కమ్ చెప్పారు.
జియో మామి ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ బోర్డ్ లోకి సరికొత్తగా ముగ్గురు సభ్యులు రావడంతో వారికి రానా సాదర స్వాగతం పలికారు.
జియో మామి ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ బోర్డ్ లోకి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా చైర్ పర్సన్ గా ఎంపిక కాగా, ఫిలిం మేకర్ శివి దుంగర్పుర్ అలాగే ఫిలిం మేకర్ అయిన అంజలి మీనన్ ఇద్దరు జియో మామి సభ్యులుగా చేరడంతో వీరికి రానా స్వాగతం పలికారు.
ఈ క్రమంలోనే ఈ ముగ్గురు జియో మామి బోర్డు సభ్యులుగా ఎన్నిక కావడంతో రానా సంతోషం వ్యక్తం చేస్తూ. ట్విట్టర్ వేదికగా వారికి స్వాగతం పలికారు.
ప్రస్తుతం రానా చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక సినిమాల విషయానికొస్తే రానా “విరాటపర్వం” అనే సినిమాలో నటిస్తున్నారు.అదేవిధంగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కుతున్నటువంటి “భీమ్లా నాయక్”అనే సినిమాలో నటిస్తున్నారు.ఇందులో రానా ఒక పవర్ ఫుల్ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.