ఆంధ్రప్రదేశ్ ఒడిశా సరిహద్దుల వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది.కోటియా కు వెళ్లేందుకు సిద్ధమైన ఆంధ్రప్రదేశ్ అధికారులు నాయకులనీ ఒడిషా పోలీసులు అడ్డుకోవడం జరిగింది.
ఈ క్రమంలో రెండు రాష్ట్రాల సరిహద్దుల మధ్య పోలీసులు భారీగా మోహరించారు.ఏ రాష్ట్రానికి చెందిన ఆ రాష్ట్ర పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్ట్ లు పెట్టి అడ్డుకుంటున్నారు.
ఈ క్రమంలో ఒడిషా పోలీసులు వ్యవహరించిన తీరుపై సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర ఆగ్రహం చెందారు.
సరిహద్దుల్లో దాదాపు 34 గ్రామాలలో వివాద వాతావరణం నెలకొంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పాఠశాలలో ఓపెన్ చేయడంతో ఈ గ్రామాలలో పర్యటించాలని వైసీపీ ప్రజా ప్రతినిధులు ప్రయత్నించడమే కాకుండా “జగనన్న విద్యా కానుక” కిట్లు స్కూల్లో విద్యార్థులకు అందించాలని.ప్రయత్నాలు మొదలు పెట్టగా ఒడిషా పోలీసులు.
అడ్డుకోవడం జరిగింది.ఇదే టైంలో ఏపీ ఉపాధ్యాయులను కూడా ఒడిషా పోలీసులు అడ్డుకుంటున్నారు.
ఈ పరిణామంతో ఏపీ ఒడిశా సరిహద్దు బార్డర్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ వాతావరణం నెలకొంది.