టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న యంగ్ హీరోల్లో శ్రీవిష్ణు కూడా ఒకరు.ఆయన చేసే సినిమాలో ఖచ్చితంగా ఏదో ఓ ప్రత్యేకత ఉంటుందనే భావన చిత్ర ఆడియెన్స్లో కలుగుతుంది.
దీంతో ఆయన నటించే సినిమాలు చూసేందుకు జనం థియేటర్లకు పరుగులు తీస్తుంటారు.ఇక ఈ క్రమంలోనే ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం ‘రాజ రాజ చోర’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుంది.
ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు శ్రీవిష్ణు రెడీ అయ్యాడు.
కాగా ఈ సినిమాలో ఓ తెలివైన దొంగగా శ్రీవిష్ణు ప్రేక్షకులను అలరించనున్నాడు.
ఇక ఈ హీరోకు జోడీగా అందాల భామ మేఘా ఆకాష్ నటిస్తోంది.ఈ సినిమా ఆద్యాంతం కామెడీ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దారు చిత్ర యూనిట్.
ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా, తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ను చిత్ర యూనిట్ అఫీషియల్గా అనౌన్స్ చేసింది.ఈ సినిమాను ఆగస్టు 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తు్న్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.
ఈ సినిమాతో శ్రీవిష్ణు ఖచ్చితంగా హిట్ కొడతాడని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
ఇక ఈ సినిమాను హసిత్ గోలి డైరెక్ట్ చేస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.
మరి ఆగస్టు 19న రంగంలోకి దిగుతున్న ఈ చోరుడు ప్రజల మనసుల్ని ఎంతమేర దొంగలిస్తాడో చూడాలి.ఈ సినిమాలో తనికెళ్ల భరణి, రవిబాబు వంటి పలువురు కీలక నటీనటులు కూడా ఉండటం విశేషం.
ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు.మరి ఈ దొంగ చేసే పనులు ఎలా ఉండబోతున్నాయో ఆగస్టు 19న థియేటర్లలో చూడాల్సిందే.
ఈ సినిమాపై ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు క్రియేట్ కావడం విశేషం.