అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ శాకుంతలం సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టబోతుందని అందరికి తెలిసిన విషయమే.ఈ సినిమా ద్వారా అర్హ బాల నటిగా మన ముందుకు రాబోతుంది.
అంతేకాదు మొదటి సినిమానే పాన్ ఇండియా సినిమా కావడం విశేషం.క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం శాకుంతలం.
ఈ సినిమాలో ప్రిన్స్ భరత పాత్రలో అల్లు అర్హ నటించ బోతుంది.
ప్రస్తుతం శాకుంతలం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది.
గత కొన్ని రోజులుగా అల్లు అర్హ శాకుంతలం సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది.అల్లు అర్హతో పాటు షూటింగ్ కు అల్లు స్నేహ కూడా వెళ్తుంది.
రెండు రోజులు క్రితం అల్లు అర్జున్ కూడా కూతురుకు శాకుంతలం సెట్స్ కు వెళ్లి మరి సర్ప్రైజ్ చేసిన విషయం కూడా తెలిసిందే.మొదటిసారి తన గారాలపట్టి సినిమాలో నటిస్తుండడంతో అల్లు కుటుంబం మొత్తం ఆనందంగా ఉంది.
తాజాగా అల్లు అర్హ తన షూటింగ్ ను కంప్లీట్ చేసుకున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది.వారం రోజుల పాటు అల్లు అర్హ శాకుంతలం సెట్స్ లో సందడి చేసింది.దీంతో అల్లు అర్హకు చిత్ర యూనిట్ ఘనంగా వీడ్కోలు పలికారు.తనకు చిత్ర యూనిట్ స్వాగతం పలికినప్పుడు చేసిన సందడే వీడ్కోలు చెప్పేటప్పుడు కూడా అంతే సందడి కనిపించింది.
అల్లు అర్హతో కేక్ కట్ చేయించి సందడి చేసింది చిత్ర యూనిట్.
అల్లు అర్హకు వీడ్కోలు పలికేటప్పుడు అల్లు అర్జున్, అల్లు స్నేహ కూడా ఉన్నారు.అందరూ ఎంతో ఆనందంగా అర్హ కు వీడ్కోలు పలికారు.ఇప్పుడు దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సినిమాలో అక్కినేని సమంత, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.శకుంతల, దుష్యంతుడి అందమైన ప్రేమ కథను గుణశేఖర్ మన ముందుకు తీసుకు రాబోతున్నాడు.
ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.