దర్శకుడిగా చేసింది తక్కువ సినిమాలే అయినా తన సినిమాల ద్వారా శేఖర్ కమ్ముల ప్రేక్షకుల హృదయాల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్నారు.శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన తొలి సినిమా డాలర్ డ్రీమ్స్ కాగా ఆ తర్వాత తెరకెక్కిన ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్ సినిమాలు దర్శకుడిగా శేఖర్ కమ్ములకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా ఫిదా సినిమాతో శేఖర్ కమ్ముల భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు.
కుటుంబసమేతంగా చూసే సినిమాలను శేఖర్ కమ్ముల ఎక్కువగా తెరకెక్కించడం గమనార్హం.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది.ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా ఈ సినిమా ఎప్పుడు రిలీజవుతుందో తెలియాల్సి ఉంది.
అయితే నటుడు పార్వతీశం శేఖర్ కమ్ముల గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
తనపై ఓవర్ యాక్టింగ్ అని ఎవరూ కామెంట్లు చేయలేదని తన సినిమాలు చూస్తే తనకే అనిపిస్తుందని పార్వతీశం చెప్పుకొచ్చారు.
తాను లౌడ్ కామెడీ చేస్తానని తనకొచ్చే పాత్రలే అలాంటివని పార్వతీశం పేర్కొన్నారు.తాను సెటిల్డ్ గా చేద్దామని అనుకుంటానని కానీ అలా చేసే పాత్రలు రావడం లేదని పార్వతీశం వెల్లడించారు.
తనకు శేఖర్ కమ్ముల అంటే ఇష్టమని ఆయన ఇంటివెనుక రూమ్ తీసుకున్నానని పార్వతీశం పేర్కొన్నారు.
ఆయన సినిమా రిలీజైతే సెకండాఫ్ బాలేదని పోస్టర్ అతికించానని ఆయనకు గుర్తుందో లేదో తనకు తెలీదని పార్వతీశం తెలిపారు.శేఖర్ కమ్ముల సినిమాల్లో కొత్తవాళ్లను తీసుకుంటారని అందుకే ఆయన ఇంటి దగ్గర రూమ్ తీసుకున్నానని పార్వతీశం పేర్కొన్నారు.తాను డైరెక్టర్లను మొహమాటం లేకుండా ఆఫర్లు అడుగుతానని అవసరమైతే అడిషన్ కు కూడా హాజరవుతానని పార్వతీశం వెల్లడించారు.