సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో పని చేసే సెలబ్రిటీలు కథ ఎలా డిమాండ్ చేస్తే ఆ విధంగా వారి శరీరాకృతిని మార్చుకోవాల్సి ఉంటుంది.ఈ క్రమంలోనే సినిమాలలో సహజంగా,గర్భవతిగా కనిపించడం కోసం ఏకంగా 15 కిలోల బరువు పెరిగినట్లు తెలిపారు బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్.
తాజాగా కృతిసనన్ “మిమీ”అనే చిత్రంలో నటించిన సంగతి మనకు తెలిసిందే.ఈ చిత్రంలో సరోగసి ద్వారా ఒక బిడ్డకు జన్మనిచ్చారు.
ఈ క్రమంలోనే ఆమె ఎదుర్కొనే అవమానాలను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు.
ఈ సినిమాలో సహజంగా గర్భవతిగా కనిపించడం కోసం ఏకంగా 15 కిలోల బరువు పెరిగినట్లు నటి తెలియజేశారు.
అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో ఈమె తన శరీర బరువును తగ్గించుకునే పనిలో పడ్డారు.ఈ క్రమంలోనే ఎంతో కఠినతరమైన వ్యాయామాలను, వర్క్ అవుట్ చేస్తూ తిరిగి పూర్వ రూపాన్ని తెచ్చుకున్నారు.
తాజాగా ఈ నటి బరువు తగ్గడం కోసం చేస్తున్నటువంటి కఠిన వ్యాయామాలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ఈ క్రమంలోనే నటి మాట్లాడుతూ సుమారు మూడు నెలల పాటు ఎలాంటి యోగా, వర్కౌట్ లేకుండా అమాంతం శరీర బరువు పెరిగానని బరువును తగ్గించుకోవడం అంత సులభమేమీ కాదని తెలియజేశారు.కృతీ సనన్, పంకజ్ త్రిపాఠి ముఖ్యపాత్రల్లో నటించిన “మిమీ” నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతోంది.సరోగసీ ద్వారా బిడ్డను కావాలనుకున్న రోజంట తీరా బిడ్డ పుట్టే సమయానికి తమకు ఉందని చెప్పడంతో మిమీ ఏ విధమైనటువంటి కష్టాలను అవమానాలను ఎదుర్కొంది అనే అంశంపై ఈ సినిమాను తెరకెక్కించారు.