గతకొద్దీ రోజుల నుండి మా ఎలక్షన్స్ పై వాదనలు వస్తూనే ఉన్నాయి.ఇక ఈ ఎలక్షన్స్ ని ప్రశాంతంగా జరపడానికి పెద్దలు ఎంత ప్రయత్నిస్తున్నా అన్ని విఫలం అవుతున్నాయి.
తాజాగా నటి హేమ సంచలన కామెంట్స్ చేశారు.అయితే.
మా ఎన్నికలు ఏకగ్రీవం ఉండకుండా చూడాలంటూ ఈమె తన బృందంలోని సభ్యులందరికీ వాయిస్ మేసేజ్లు పంపించారు.అంతేకాక.
మా అధ్యక్షుడిగా ఉన్న నరేష్పై కూడా ఆమె సంచలన ఆరోపణలు చేశారు.ఇక ఈయన సంపాదించింది లేదు కానీ ఉన్నదంతా కూర్చుని ఖర్చు పెడుతున్నాడంటూ హేమ ఆరోపించింది.
అయితే ఈమె పంపిన వాయిస్ మెసేజ్లో ఏం ఉందో ఒక్కసారి చూద్దామా.
హాయ్ అండి.
నేను హేమ ఈ మెసేజ్ అందరికీ ఒకేసారి కామన్గా పంపిస్తున్నాను.ఇక మా అసోషియేషన్ ఎలక్షన్స్ పెట్టకూడదు.
నరేష్ గారే ప్రెసిడెంట్గా కొనసాగాలని చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు.అయితే నరేష్ అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా సంపాదించింది లేదని అన్నారు.
అంతేకాక.ఉన్న డబ్బులనే కూర్చుని మరీ ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు.అయితే మొత్తం ఉన్న రూ.5 కోట్లలో రూ.3 కోట్లు ఖర్చు పెట్టేశారని అన్నారు.
కాగా.పోయినసారి మెడికల్ క్లైమ్కి, రాబోయే మెడికల్ క్లైమ్కి కలిపి మొత్తం 2.5 కోట్లకు పైగా ఖర్చు అయినట్లు లెక్క అని అన్నారు.అంతేకాక.ఆఫీస్ ఖర్చులు అవీ, ఇవీ కలిపి దాదాపు అంతే అవుతుందని ఆమె పేర్కొన్నారు.ఇక అప్పట్లో ఆఫీస్ ఖర్చులు ఏమైనా ఉంటే బయటి నుంచి తీసుకొచ్చేవాళ్లం కానీ అకౌంట్లో ఉన్న డబ్బులను వాడుకునేవాళ్లం కాదని ఆమె వాపోయారు.
ఇక ఇప్పుడాయన అలా కాదు.మన అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తున్నారని వాపోయింది.అంతేకాదు.
పైగా ఆ కుర్చీ దిగకూడదు.ఎలక్షన్స్ జరగకూడదు అని ప్లాన్స్ వేస్తున్నారని పేర్కొంది.
ఇక అందుకే ఖచ్చితంగా మా ఎన్నికలు రావాలి.అలా మనం సంతకాలు చేయాలని ఆమె వేడుకున్నారు.
అందుకు నేను మనిషిని పంపిస్తాన.మీరు సంతకాలు చేసి ఇవ్వండి అని ఆమె పేర్కొన్నారు.
ఇక ప్రస్తుతం ఈ మాటలు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.