ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతోంది.ఈ సీజన్లో చల్ల గాలులు, చిట పట చినుకులకు మనసు మనోహరంగా మారుతోంది.
ఈ క్రమంలోనే నోటికి ఏవి తినాలనిపిస్తే వాటిని లాగించేస్తుంటారు.టీలు, కాఫీల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఒకటి, రెండు సార్లు తీసుకునే వారు.వర్షాకాలంలో మాత్రం లెక్కకు మిక్కిలిగా సేవిస్తుంటారు.
పైగా వ్యాయామాలను కూడా అశ్రద్ధ చేసేస్తారు.దాంతో శరీర బరువు అమాంతం పెరిగి పోతుంటారు.
అయితే అలా పెరగకుండా ఉండాలీ అంటే ఖచ్చితంగా కొన్ని ఫుడ్స్ డైట్లో చేర్చుకోవాలని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.మరి ఆ ఫుడ్స్ ఏంటో లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
సూప్స్ బరువును అదుపులో ఉంచడంలో గ్రేట్గా సహాయపడతాయి.ఈ వర్షాకాలంలో వేడి వేడి సూప్స్ తీసుకోవడం వల్ల మస్తు మజా రావడమే కాదు అతి ఆకలి తగ్గుతుంది.
దాంతో చిరు తిండ్లపై మనసు మల్లకుండా ఉంటుంది.ఫలితంగా బరువు పెరగకుండా ఉంటారు.
అధిక బరువును నియంత్రించడంలో చియా సీడ్స్ ఉపయోగపడతాయి.ప్రతి రోజు ఉదయాన్నే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటితో చియా సీడ్స్, నిమ్మ రసం మరియు తేనె కలిపి తీసుకుంటే.
శరీరంలో పెరుకుపోయిన కొవ్వు కరుగుతుంది.
ఈ సీజన్లో టమాటాలు విరి విరిగా లభిస్తుంటాయి.అయితే ఆ టమాటాలతో జ్యూస్ తయారు చేసుకుని తీసుకోవాలి.ఎందుకంటే, ఫ్యాట్ బర్నింగ్ హార్మోన్ ఉత్పత్తికి టమాటాలో ఉండే పోషకాలు హెల్ప్ చేస్తాయి.
అలాగే ఈ వర్షాకాలంలో ఖచ్చితంగా నాన బెట్టిన బాదం పప్పులను డైట్లో చేర్చుకోవాలి.బాదం పప్పు తినడం వల్ల శరీరానికి బోలెడంత శక్తి లభించడంతో పాటుగా అతి ఆకలిని అరికట్టే హార్మోన్లు విడుదల అవుతాయి.
బరువు పెరగకుండా చేయడంలో సీజనల్ ఫ్రూట్స్ ఎఫెక్టివ్గా సహాయపడతాయి.దానిమ్మ, యాపిల్, నేరేడు, చెర్రీ, అరటి, బొప్పాయి, పియర్స్ వంటివి డైట్లో చేర్చుకుంటే మంచిది.ఇక బ్రౌన్ రైస్, ఓట్స్, బీన్స్, త్రుణదాన్యాలు వంటి ఆహారాలు కూడా బరువును కంట్రోల్లో ఉంచేందుకు సహాయపడతాయి.