ఎవరి ఇంట్లోనైనా బంగారం కానీ, డబ్బులు కానీ పోతే పోలీసులకు ఫిర్యాదు చేయడం గురించి మనం వినే ఉంటాము.అలాగే ఏదన్న ఆఫీసులో అయితే విలువైన వస్తువులు, డాకుమెంట్స్, ఏవన్నా లెక్కల్లో అవకతవకలు లాంటి తేడాలు వస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం మనం వినే ఉంటాము.
కానీ మీరెప్పుడన్నా ఒక విస్కీ బాటిల్ పోతే కంప్లైంట్ ఇవ్వడం గురించి విన్నారా.? వినడానికి కొత్తగా, ఫన్నీగా ఉన్నా ఈ ఘటన మాత్రం నిజంగానే జరిగింది.అది కూడా ఎక్కడో తెలిస్తే మీరే షాక్ అవుతారు.ఎంతో అభివృద్ధి చెందిన అమెరికా దేశంలో ఈ విస్కీ బాటిల్ కనిపించకపోవడంపై విచారణ చెపట్టారు అధికారులు.
అమెరికా లాంటి దేశంలో కేవలం ఒక విస్కీ బాటిల్ గురించి ఇంత పెద్ద సీన్ చేయడం అవసరమా అని చాలామంది అనుకోవచ్చు.కానీ నిజంగానే అమెరికాలో ఈ రచ్చ జరిగింది.
అసలు ఆ విస్కీ బాటిల్ కోసం ఎందుకు అధికారులు అంతలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.
కనిపించకుండా పోయిన ఆ విస్కీ బాటిల్ ధర ఎంతో తెలిస్తే మీరే షాక్ అవుతారు.ఆ బాటిల్ ఖరీదు 5800 డాలర్లు అంట.అంటే మన ఇండియన్ కరెన్సీలో అక్షరాలా 4.30 లక్షల రూపాయిలు అన్నమాట.ఏంటి బాటిల్ ధర చూసి అవాక్కయ్యారా.? కానీ ఇది నిజం.అలాగే ఆ విస్కీ బాటిల్ కు మరొక ప్రత్యేకత కూడా ఉందంట.
అది ఏంటంటే.ఓ దేశానికీ చెందిన ప్రముఖులు మరొక దేశంలోకి పర్యటనకు వెళ్ళినప్పుడు ఆ దేశ ప్రజా ప్రతినిధులు గుర్తుగా కొన్ని బహుమతులతో వాళ్ళని సత్కరించడం జరుగుతుంది కదా.ఈ క్రమంలోనే 2019 సంవత్సరంలో అమెరికా విదేశాంగ కార్యదర్శిగా పనిచేస్తున్న మైక్ పాంపియో సౌదీ అరేబియాకు వెళ్లారట.ఆ సమయంలో జపాన్ అధికారులు అమెరికా విదేశాంగ శాఖకు ఈ ఖరీదైన విస్కీ బాటిల్ ను బహుమతిగా ఇవ్వడం జరిగిందట.ఈ విషయాన్ని అమెరికా ట్రెజరీ విభాగం అధికారులు తెలియచేసారు.కానీ ఇప్పుడు లెక్కలు చూడగా ఆ విస్కీ బాటిల్ మాత్రం తమ అధికారిక లెక్కల్లో మిస్ అయినట్లు తెలియడంతో అధికారులు ఆందోళన చెందారు.
ఆ విస్కీ బాటిల్ కేసును ఒక ఛాలెంజిగ్ గా తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.ఎంతో టెక్నాలజీ ఉన్నా అమెరికా లాంటి దేశంలో ప్రభుత్వ అండర్ లో ఉన్న ఓ ఖరీదైన వస్తువు కనిపించకుండా పోవటంతో ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది.
వినడానికి కాస్త ఫన్నీగా ఉన్నా ఈ కేసును మాత్రం సీరియస్ గా తీసుకున్నారు అధికారులు.ఆ విస్కీ బాటిల్ లెక్క తేలాలిసిందే అంటూన్నారు అధికారులు.