సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్ లలో తెరకెక్కే సినిమాల గురించి అధికారిక ప్రకటన వెలువడగానే ఆ సినిమాపై భారీ అంచనాలు పెరుగుతాయి.ఈ విధంగా సినిమా షూటింగ్ సమయంలో ఎంతో బజ్ క్రియేట్ చేసుకొని థియేటర్ లోకి రాగానే థియేటర్ వద్ద బోల్తా పడిన సినిమాలు ఎన్నో ఉన్నాయి.
ఎన్నో అంచనాల నడుమ విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను తీవ్ర నిరాశ పరచడమే కాకుండా నిర్మాతలకు భారీ నష్టాలను తెచ్చాయి.
ఇలా భారీ అంచనాల నడుమ విడుదలైన నిర్మాతకు భారీ నష్టాన్ని కల్పించిన సినిమాలో ఎన్టీఆర్ కీలక పాత్రలో నటించిన “శక్తి” సినిమా ఒకటని చెప్పవచ్చు.
శక్తి సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ నిర్మించగా ఈ చిత్రానికి దర్శకుడిగా మెహర్ రమేష్ పని చేశారు.వీరి కాంబినేషన్లో తెరకెక్కిన మరొక చిత్రం “కంత్రీ” కూడా బాక్సాఫీస్ వద్ద పరవాలేదు అనిపించుకుంది.
మొదట్లో ఈ సినిమా తెరకెక్కించాలని భావించినప్పుడు చాలామంది ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంటుందని భావించినప్పటికీ మరికొందరు మాత్రం చాలా రిస్కు చేస్తున్నారని చెప్పినట్లు నిర్మాత అశ్వినీ దత్ తో ఇంటర్వ్యూలో తెలిపారు.
అలా చెప్పిన వారిలో సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఉన్నారని అశ్వినీదత్ ఇంటర్వ్యూలో వెల్లడించారు.ఈ క్రమంలోనే ఒకసారి రజనీకాంత్ అతనికి ఫోన్ చేసి ఎక్కువగా రిస్క్ చేయవద్దని తెలిపినట్లు చెప్పారు.అదేవిధంగా పరిహారంగా ఏవైనా పూజలు, హోమాలు చేయమని రజనీకాంత్ సలహా ఇచ్చినట్లు కూడా తెలిపారు.
అయితే అప్పటికే సినిమా సెట్స్పైకి వెళ్లడం వల్ల సినిమాని మధ్యలో ఆపడం కుదరలేదని ఈ సినిమా వల్ల ఏకంగా 25 కోట్లు నష్టపోయానని నిర్మాత అశ్వినీదత్ ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు.