1.భారత ప్రయాణికులకు యూకే శుభవార్త
భారత ప్రయాణికులు ఆనందించే విషయాన్ని యూపీఏ ప్రభుత్వం చెప్పింది.కోవేట్ అంశాలను తరలిస్తున్నట్లు ప్రకటించింది.భారత్ లో కరోనా వైరస్ కాస్త తగ్గుముఖం పట్టడంతో, కోవిడ్ వాక్సిన్ ను పూర్తిస్థాయిలో తీసుకున్న భారత ప్రయాణికులు బ్రిటన్ లో పది రోజుల పాటు తప్పనిసరిగా హోటల్ క్వారంటైన్ లో ఉండాల్సిన అవసరం లేదని ప్రకటించింది.
2.కొవాగ్జిన్ పై కెనడాకు భారత్ బయోటెక్ విజ్ఞప్తి
అత్యవసర వినియోగం కోసం కోవాగ్జిన్ కు ఆమోదం తెలపాలని భారత్ బయోటెక్ సంస్థ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
3.యూఏఈ ప్రకటనతో పెరిగిన విమాన చార్జీలు
కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకున్న ప్రవాసీలు తిరిగి వచ్చేందుకు యూఏఈ అనుమతి ఇవ్వడంతో, భారత్ పాకిస్థాన్, శ్రీలంక, నేపాల్, నైజీరియా , ఉగాండా ప్రవాసులకు ట్రాన్సిట్ విమానాల ద్వారా యూఏఈ వెళ్లేందుకు అవకాశం ఉంది.
ఈ ప్రకటన వెలువడిన వెంటనే విమానయాన సంస్థలు టిక్కెట్ ధరలను భారీగా పెంచాయి.సాధారణం కంటే మూడు వందల రెట్లు అధికంగా టికెట్ ధరలు పెరిగినట్లు ఢిల్లీ ముంబై కోల్కతా లలో ట్రావెల్ ఏజెన్సీలు కలిగివున్న డిడి పేర్కొన్నారు.
4.ప్రవాసుల విషయంలో కువైత్ సంచలన నిర్ణయం
ట్రాఫిక్ జరిమానా చెల్లించని ప్రవాసుల విషయంలో గల్ఫ్ దేశం కువైత్ కీలక నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉంది.ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన ప్రవాసులు వాటికి సంబంధించిన జరిమానాలు చెల్లించకుండా దేశం విడిచిపెట్టి వెళ్ళకుండా బ్యాన్ విధించాలనే ప్రతిపాదన చేసే ఆలోచనలో కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ ఉన్నట్లు సమాచారం.
5.కోవిడ్ వేరియంట్ల పై పౌచి ఆందోళన
అమెరికాలో కరోనా డెల్టా వేరియంట్ తీవ్రంగా వ్యాపిస్తోంది.ఈ క్రమంలో అమెరికా అంటు వ్యాధుల నిపుణుడు ఆంథోనీ పౌచీ సంచలన వ్యాఖ్యలు చేశారు.భవిష్యత్తులో వ్యాక్సిన్ లకు లొంగని వేరియంట్లు అభివృద్ధి చెందే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
6.7 రోజుల్లో కోటి మందికి వాక్సిన్ లక్ష్యం
కరోనా తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో వారం రోజుల వ్యవధిలో కోటిమందికి వ్యాక్సిన్ వేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని బంగ్లాదేశ్ ప్రభుత్వం తాజాగా వెల్లడించింది.
7.బూస్టర్ డోసులు అప్పుడే వద్దు : డబ్ల్యుహెచ్వో
కరోనా నుంచి రక్షణ పొందేందుకు బూస్టర్ డోసులు ఇవ్వాలని చాలా దేశాలు చూస్తుండటంతో, దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.ఇప్పుడే బూస్టర్ డోసులు వద్దని వారిస్తుంది.
8.ముసుగు వేసుకోని మహిళను కాల్చిన తాలిబన్లు
ముఖానికి ముసుగు వేసుకోని మహిళను తాలిబన్లు గన్తో కాల్చి చంపారు.ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబన్ నియంత్రణ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు ఆఫ్ఘనిస్తాన్ టైమ్స్ పేర్కొంది.
9.చైనా ను వణికిస్తున్న డెల్టా వైరస్
కరుణ కు పుట్టినిల్లయిన చైనాలో ఎప్పుడు డెల్టా వేరియంట్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది.దీంతో చైనా మరోసారి కఠినమైన ప్రయాణ ఆంక్షలను విధించింది.
10.టోక్యో ఒలంపిక్స్ లో మాధురి దీక్షిత్ పాట
జపాన్ రాజధాని టోక్యో లో జరుగుతున్న ఒలంపిక్స్ లో బాలీవుడ్కు చెందిన ఓ పాట వైరల్ గా మారింది.ఆర్టిస్టిక్ స్విమ్మింగ్ డ్యూయెట్ ఫ్రీ రొటీన్ ప్రిలిమినరీలో బీ టౌన్ బ్యూటీ మాధురి దీక్షిత్ నటించిన పాపులర్ సాంగ్ ‘ ఆజా నాచ్లె ‘ ఈ పాటకు డాన్స్ చేస్తూ స్విమ్ చేశారు.