టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఓ రేంజ్ లో దూసుకుపోతుంది కన్నడ బ్యూటీ రష్మిక మందన.అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది.
పైగా ఇండియన్ క్రష్, మోస్ట్ డిజైరబుల్ హీరోయిన్ గా నిలిచింది.టాలీవుడ్ లోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెంచుకుంది రష్మిక మందన.
సోషల్ మీడియాలో నిత్యం ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ అల్లరి పిల్లగా నిలిచింది.ఇదిలా ఉంటే అమితాబ్ బచ్చన్ తో ఉన్న ఓ అనుభవాన్ని పంచుకుంది.
ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉంది రష్మిక మందన.అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప‘ లో హీరోయిన్ గా నటిస్తుంది.ఇందులో పల్లెటూరి అమ్మాయి గెటప్ లో కనిపించనుంది.అంతే కాకుండా బాలీవుడ్ లో గుడ్ బై, మిషన్ మజ్ను అనే వరుస సినిమాలలో నటిస్తుంది.
ఇక గుడ్ బై సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ బిజీగా ఉండగా ఈ ఏడాది డిసెంబర్ చివరి వారంలో విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో కొన్ని సీక్రెట్స్ లను పంచుకున్న రష్మిక మందన. తనకు అమితాబ్ తో కలిసి నటించడం గొప్ప అనుభూతి అని తెలిపింది.లెజెండ్ తో కలిసి పనిచేయడంతో చాలా విషయాలు తెలుసుకునే అవకాశం వచ్చిందని.ఆయనతో సన్నిహితంగా ఉండే అవకాశం తనకు దక్కడం పూర్వజన్మ సుకృతమని అనుకుంటున్నా అని తెలిపింది.
ఇక పాత్రకు తగ్గట్టుగా ఎలా పర్ఫామెన్స్ చేయాలో అనే విషయాలను.అలాగే షూటింగ్ సమయంలో ఇలా సరదాగా ఉండాలి అనే విషయాలను అమితాబ్ నుంచి నేర్చుకుంటుంనందుకు సంతోషమని తెలిపింది.ఇక షూటింగ్ సెట్ సమయంలో ఎదురుగా ఉండే నటులు, డైరెక్టర్లు కంఫర్ట్ గా ఉంటే చాలా సౌలభ్యంగా ఉంటుందని.దాంతో మనలో ఉన్న ప్రతిభను కూడా సులువగా బయట పెట్టవచ్చని తెలిపింది రష్మిక మందన.