ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి స్టార్ గా గుర్తింపు తెచ్చుకుని వరుస సినిమాలు చేస్తూ ఎవ్వరికి అందనంత ఎత్తుకు చేరుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.ఈయన పాన్ ఇండియా సినిమాలతో పాటు పాన్ వరల్డ్ సినిమా కూడా చేస్తున్నాడు.
టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమా చేయబోతున్న విషయం అందరికి తెలిసిందే.ఇది పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించ బోతున్నారు.
నాగ్ అశ్విన్ చేసింది రెండే సినిమాలు అయినా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మహానటి సినిమా ద్వారా నాగ్ అశ్విన్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు.ఈ సినిమా తర్వాత డైరెక్ట్ ప్రభాస్ తో సినిమా చేసే అవకాశం అందుకున్నాడు.నాగ్ అశ్విన్ ఇప్పటికే ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసి ఈ సినిమాకు సంబంధించి సెట్స్ కూడా వేయిస్తున్నాడని టాక్.
భారీ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ్ అశ్విన్ అడ్వాన్స్డ్ ఫ్యూచర్ చూపించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.ఈ సినిమాకు వర్కింగ్ టైటిల్ గా ప్రాజెక్ట్ కే పెట్టిన విషయం కూడా తెలిసిందే.ఇప్పటికే ప్రభాస్ లేకుండానే షూట్ స్టార్ట్ చేసినట్టు కూడా టాక్ వినిపిస్తుంది.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ ఈ సినిమా షూట్ లో జనవరి నుండి పాల్గొన బోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఎందుకంటే ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సలార్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.ఈ సినిమా షూట్ గ్యాప్ లో ఓం రౌత్ దర్శకత్వంలో చేస్తున్న ఆదిపురుష్స నిమా షూట్ లో పాల్గొన బోతున్నట్టు తెలుస్తుంది.ఈ సంవత్సరం మొత్తం ఈ రెండు సినిమాలకే డేట్స్ కేటాయించాడట.అందుకే నాగ్ అశ్విన్ సినిమాలో జనవరిలో పాల్గొన బోతున్నాడని తాజా సమాచారం.మరి చూడాలి ఈ వార్తలో నిజానిజాలు ఎంతో.