ప్రజెంట్ డిజిటల్ ప్లాట్ ఫామ్స్దే హవా నడుస్తోంది.జనాలు అంతా డిజిటల్లీ అటాచ్ అయి ఉండటాన్ని మనం చూడొచ్చు.
మార్కెట్లో డిజిటల్ ప్లాట్ ఫామ్స్కు పోటీగా కొత్త కొత్త యాప్స్ వస్తున్నాయి.ఈ క్రమంలోనే పోటీని తట్టుకోవడం మస్ట్.
అందుకు యూజర్స్ కోసం న్యూ ఫీచర్స్ ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంటుంది.తాజాగా మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ యూజర్స్ కోసం కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకురాబోతున్నది.
అదేంటంటే.
ట్విట్టర్ పిట్ట యూజర్స్ ఇక అంతకు ముందులాగా లాగిన్ ఐడీ పాస్వర్డ్ టైప్ చేయాల్సిన అవసరం లేదండోయ్యా పిల్ ఐడీ లేదా గూగుల్ అకౌంట్ ద్వారా కూడా మైక్రోబ్లాగింగ్ సైట్లోకి సైన్ ఇన్ కావచ్చు.
అయితే, గూగుల్ అకౌంట్, యాపిల్ ఐడీలు మాత్రం గుర్తించుకోవాల్సిందే.ఈ ఫీచర్ను ప్రస్తుతం బీటా స్టేజ్లో టెస్టింగ్ చేస్తున్నారు.త్వరలో ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి వస్తుంది.ఇందుకుగాను ట్విట్టర్ యూజర్స్ తమ గూగుల్ లేదా యాపిల్ అకౌంట్స్ను ట్విట్టర్తో లింక్ అయి ఉన్న ఈమెయిల్ ఐడీలు ఒకేలా ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది.
ఒకవేళ డిఫరెంట్గా ఉంటే లాగిన్ అయ్యే చాన్సెస్ ఉండవు.ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది.
ఈ మేరకు పలు విషయాలను ట్విట్టర్ సంస్థ ట్వీట్లో వివరించింది.
ప్రజెంట్ అయితే ట్విట్టర్ యూజర్స్ గూగుల్ లింక్ చేసిన అకౌంట్తో ట్విట్టర్ యాప్, ట్విట్టర్ వెబ్ రెండూ యూజ్ చేయొచ్చు.ఈ ఫీచర్ ద్వారా సైన్ ఇన్ ప్రాసెస్ వెరీ స్పీడ్ అవుతుంది.ఫలితంగా యూజర్స్ డైరెక్ట్గా ట్వీట్స్ చేసుకోవచ్చు.
ఈ క్రమంలోనే ఫీచర్ ద్వారా గూగుల్, యాపిల్ ఐడీస్ను డిస్ కనెక్ట్ కూడా చేసుకోవచ్చు.ప్రస్తుతానికి వెబ్ వర్షన్లోనే ఈ ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయి.
త్వరలో అన్ని డివైజ్లకు ఈ సేవలు విస్తరించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.