టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు వరుస సినిమాలు తెరకెక్కించిన దర్శకులలో ముత్యాల సుబ్బయ్య ఒకరు.ముత్యాల సుబ్బయ్య తాను చాలా సంస్థలలో పని చేశానని అయితే ఉషాకిరణ్ మూవీస్ లో కూడా అవకాశం వస్తే బాగుంటుందని భావించిన సమయంలో తనకు అక్కడ పని చేసే అవకాశం దక్కిందని అన్నారు.
ఘటికాచలం చెప్పిన కథ రామోజీరావుకు నచ్చడంతో దీవించండి అనే టైటిల్ తో ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాను ప్లాన్ చేశామని ముత్యాల సుబ్బయ్య అన్నారు.
హీరోగా శ్రీకాంత్ ఎంపిక కాగా హీరోయిన్ కోసం సిమ్రాన్ ను ప్రయత్నించామని అయితే రెమ్యునరేషన్ విషయంలో సమస్య ఏర్పడిందని ముత్యాల సుబ్బయ్య తెలిపారు.
కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సిమ్రాన్ సగం రెమ్యునరేషన్ ను వైట్ లో, సగం రెమ్యునరేషన్ ను బ్లాక్ లో ఇమ్మని అడిగారని అయితే ఉషాకిరణ్ మూవీస్ చెక్ రూపంలో మాత్రమే పేమెంట్లు చేస్తారు కాబట్టి అందుకు అంగీకరించలేదని ముత్యాల సుబ్బయ్య వెల్లడించారు.
ఆ తర్వాత ఈ సినిమాలో రాశి, మాళవిక హీరోయిన్లుగా ఎంపికయ్యారని సినిమాకు బాగా పబ్లిసిటీ చేయడంతో బీ, సీ సెంటర్లలో ఈ సినిమా బాగా ఆడిందని ముత్యాల సుబ్బయ్య చెప్పుకొచ్చారు.ఆ సినిమా రిలీజైన కొంతకాలం తర్వాత తాను టి.కృష్ణ గారి అబ్బాయి గోపీచంద్ ను కలిశానని ఏం చేద్దామని అనుకుంటున్నావని గోపీచంద్ ను అడగగా రష్యా నుంచి వచ్చేశానని ఇక్కడే సెటిల్ అవ్వాలని అనుకుంటున్నానని గోపీచంద్ చెప్పారని ముత్యాల సుబ్బయ్య అన్నారు.
గోపీచంద్ బ్రదర్ ప్రేమ్ చంద్ తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారని గోపీచంద్ కూడా డైరెక్షన్ డిపార్టుమెంట్ లో పని చేస్తారేమో అని భావించగా గోపీచంద్ తో పాటు వచ్చిన టి.కృష్ణ మెమోరియల్ పిక్చర్స్ అధినేత నాగేశ్వరరావు గోపీచంద్ ఆర్టిస్ట్ కావాలని అనుకుంటున్నాడని చెప్పారని ముత్యాల సుబ్బయ్య పేర్కొన్నారు.