రాం చరణ్, శంకర్ కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న భారీ బడ్జెట్ మూవీ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.ఈ సినిమాలో చరణ్ సరసన కియరా అద్వాని హీరోయిన్ గా ఫిక్స్ అవగా సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉంటుందని టాక్.
శంకర్ సినిమాలో నటించిన అమీ జాక్సన్ ను మళ్లీ ఈ సినిమాలో రిపీట్ చేస్తున్నారని టాక్.శంకర్ డైరక్షన్ లో వచ్చిన ఐ మనోహరుడు, 2.ఓ సినిమాల్లో అమీ జాక్సన్ నటించింది.ముఖ్యంగా ఐ సినిమాలో తన అందంతో కుర్రాళ్లను ఎట్రాక్ట్ చేసింది అమ్మడు.
ఇక ఇప్పుడు రాం చరణ్ సినిమాలో కూడా అమీ జాక్సన్ నటిస్తుందని తెలుస్తుంది.ప్రియుడితో డేటింగ్ పెళ్లికి ముందే ఒక బాబుకి కూడా జన్మనిచ్చిన అమీ జాక్సన్ ఇప్పుడు మళ్లీ సినిమాల మీద ఫోకస్ పెట్టాలని చూస్తుంది.
ఒక బిడ్డకు జన్మనిచ్చినా సరే అందం విషయంలో ఆమె ఏమాత్రం తగ్గకుండా జాగ్రత్తలు చూసుకుంది.అందుకే అమీ జాక్సన్ ను మరోసారి అవకాశం ఇస్తున్నట్టు టాక్.ఆర్సీ 15లో అమీ జాక్సన్ ఉంటే తెలుగు ఆడియెన్స్ కు పండుగే అని చెప్పొచ్చు.అమ్మడు కూడా ఇక మీదట పూర్తిగా సినిమాల మీద దృష్టి పెట్టాలని చూస్తుందట.