ఒలంపిక్స్ కాంస్య పతకాన్ని సాధించిన బ్యాడ్మింటన్ స్టార్ తెలుగు తేజం పీవీ సింధు ఒలంపిక్ క్రీడలు ముగించుకొని నిన్న ఢిల్లీకి చేరుకున్నారు.ఈ నేపథ్యంలో ఢిల్లీ విమానాశ్రయంలో భారీ ఎత్తున పీవీ సింధు కి ఘనస్వాగతం లభించింది.
అదే సమయంలో కేంద్ర క్రీడా శాఖ విభాగం మరియు కొంత మంది కేంద్ర మంత్రులు.పీవీ సింధు ని సత్కరించారు.
దేశ ప్రతిష్ఠను మరింత పెంచేలా కీర్తి చాటేలా పీవీ సింధు ఒలంపిక్ క్రీడల విభాగం రాణించటం సంతోషకరమని కొనియాడారు.
గతం ఒలంపిక్స్ లో రజతం ఈసారి కాంస్య పథకం సాధించడంతో కచ్చితంగా వచ్చే ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధిస్తుందని కేంద్ర మంత్రులు అన్నారు.ఇదిలా ఉంటే ఈ రోజు సొంత గడ్డ హైదరాబాద్ కి పీవీ సింధు అడుగు పెట్టనున్న నేపథ్యంలో .అభిమానులు అదే రీతిలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా గ్రాండ్ వెల్కం చెప్పడానికి రెడీ అవుతున్నాయి.వరుసగా రెండుసార్లు భారత్ తరుపున మెడల్స్ సాధించి పీవీ సింధు సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది.