ప్రకృతిలో ఎన్నో వింతలు ఉంటాయి.ఈ భూమిపై అనేక జీవులు, జంతువులు బతుకుతుంటాయి.
అందులో కొన్ని అత్యంత ఖదీదైనవి.ఇంకొన్ని అసలు విలువ లేనివిగా ఉంటాయి.ప్రపంచ వింతల్లో చాలానే ఉన్నాయి.అందులో మనకు కొన్ని వింతలు ఉన్నాయి.జంతువుల్లో కూడా చాలా వింతగా ఉంటాయి.పక్షుల్లో కొన్ని ఖరీదైనవిగా ఉంటాయి.
ఇంకొన్ని ఆసక్తికరంగా ఉంటాయి.అలాంటి ఓ పక్షి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఓ పక్షి నుంచి వచ్చే ఈకలు ఎంతో విలువతో కూడుకున్నవిగా చెప్పొచ్చు.ఆ పక్షి ఈకలు బంగారం కంటే ఎక్కువ ఖరీదైనవిగా పేరుగాంచాయి.
ఈ పక్షి నుంచి ఈకలు సేకరించడానికి ఎంతో మంది కష్టపడుతుంటారు.ఐస్ ల్యాండ్ లో ఈ పక్షులు ఎక్కువగా ఉంటాయి.
అక్కడ నివసిస్తున్న ఈడర్ పోలార్ డక్ పక్షి గురించి చాలా మంది ఇప్పుడు చర్చించుకుంటున్నారు.ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన అమ్ముడైన ఈకగా ఈ పక్షి ఈకలు పేరుపొందాయి.
ఈ పక్షి ఈకలు హాటెస్ట్ సహజ ఫైబర్ గా పరిగణించబడటం విశేషంగా చెప్పొచ్చు.
లగ్జరీ బ్రాండ్లలో ఎన్నో ఉత్పత్తులు అనేవి చేస్తుంటారు.
ఇటువంటి ఉత్పత్తులను తయారు చేయడానికి ఈకను వాడతారు.ఈ ఈక బరువు కూడా చాలా తేలికగానే ఉండటమే కాకుండా శరీరానికి చాలా వెచ్చదనాన్ని ఇస్తుంది.
ఈ ఫైబర్ అంతర్జాతీయ మార్కెట్ లో కూడా బాగా పాపులర్ అయ్యింది.అంతర్జాతీయ మార్కెట్ లో రోజూ దీని వ్యాల్యూ కూడా మారుతూ ఉంటుంది.
డక్ పక్షి తన గుడ్లను పొదిగినప్పుడు ఇటువంటి ఫైబర్ తయారవుతుంది.ఈ పక్షి నుంచి ఈకలు సేకరించేవారు దాని ఈకలు దొరికి తర్వాత వాటిలోని ఫైబర్ ను తీసుకుని కచ్చితంగా అమ్ముకుంటారు.ఇటువంటి ఫైబర్ తేలికగా ఉంటూ చాలా తక్కువ మోతాదులో లభిస్తుంది.800 గ్రా.ఫైబర్ రేటును మార్కెట్ లో చూస్తే 5000 డాలర్ల కంటే ఎక్కువగా పలుకుతుంది.బంగారం ధర కంటే ఎక్కువ రేటును ఈ పక్షి ఈకలు పలకడంతో ఇప్పుడు చర్చనీయాంశమైంది.