హుజరాబాద్ ఉప ఎన్నికలలో గెలవడం కోసం ప్రధాన పార్టీలు ఇప్పటికే బరిలోకి దిగాయి.ఎన్ని పార్టీలు రంగంలోకి దిగిన పోటాపోటీ బీజేపీ వర్సెస్ టిఆర్ఎస్ అన్నట్టు నియోజకవర్గం లో వాతావరణం క్రియేట్ అయి ఉంది.
ఈ క్రమంలో బిజెపి తరఫున మాజీ మంత్రి ఈటల రాజేందర్.ఇప్పటికే నియోజకవర్గంలో పాదయాత్ర స్టార్ట్ చేయటం.ఇంటింటి ప్రచారం చేయటం తెలిసిందే.మరో పక్క టిఆర్ఎస్ పార్టీ నేతలు కూడా నియోజకవర్గంలో పర్యటన చేస్తున్నారు.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ జాడ ఇప్పటివరకు నియోజకవర్గంలో లేని నేపథ్యంలో పిసిసి అధ్యక్షతన ఈరోజు జిల్లా .నియోజకవర్గ నాయకులతో భేటీ అవుతున్నారు.
ఉప ఎన్నిక పోటీకి అభ్యర్థి, అదే రీతిలో ప్రచారం వంటి విషయాలపై చర్చించడానికి రెడీ అయ్యారు.హుజరాబాద్ ఉప ఎన్నికల కోఆర్డినేటర్లు అయినా మాజీ మంత్రి శ్రీధర్ బాబు అదే రీతిలో జీవన్ రెడ్డి మండలాల ఇంచార్జి లతో ఈ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని పార్టీ వర్గాల నుండి అందుతున్న సమాచారం.ఎన్నికల ఇంచార్జ్ దామోదర్ నరసింహ ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంలో ఒక సారి పర్యటించడం జరిగింది. అభ్యర్థి ఉపఎన్నికలకు మాత్రమే కాకుండా భవిష్యత్ ఎన్నికలని కూడా ఎదుర్కొనే రీతిలో.
ఉండే విధంగా తెలంగాణ పిసిసి కార్యవర్గం ఆలోచన చేస్తూ ఉంది.