టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు.ఇస్మార్ట్ శంకర్, రెడ్ వంటి యాక్షన్ చిత్రాలు తరువాత ఫుల్ ఫామ్ లో ఉన్న రామ్ తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా #RAPO19 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోంది.ఈ సినిమాలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ సరసన ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి సందడి చేయబోతున్నారు.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులలో నిమగ్నమైంది.
శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస్ చిత్తూరు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషలు విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ సినిమా ఆడియో హక్కులను కొనుగోలు చేయడానికి ఆదిత్య మ్యూజిక్ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు రామ్ కెరీర్లో ఏ సినిమాకి కూడా లేని విధంగా భారీ స్థాయిలో ఈ సినిమా ఆడియో హక్కులను రూ.2.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి.అయితే ఈ విషయం పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఈ విషయమే కనుక నిజమైతే రామ్ తన సినిమా కెరీర్ లో ఇప్పటివరకు ఏ సినిమాకి ఈ స్థాయిలో ఆడియో రైట్స్ కొనలేదని ఈ సినిమా రామ్ కెరియర్ కు ది బెస్ట్ గా నిలుస్తుందని చెప్పవచ్చు.ఇక ఈ సినిమాలో రామ్ తో పోటీ పడటానికి యంగ్ హీరో ఆది పినిశెట్టి విలన్ పాత్రలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.