చాలా మంది అమ్మాయిలు ప్రేమ గుడ్డిదనే నిరూపిస్తూనే ఉంటారు.ఎందుకంటే వారు లవ్ చేసే వ్యక్తులు వారి వయస్సు గురించి కూడా ఆలోచించట్లేదు.
మైనర్ అమ్మాయిలు కూడా అంకుల్స్ను లవ్ చేస్తూ రచ్చ లేపుతున్నారు.కాగా ఇప్పుడు కూడా ఓ ఇద్దరు మైనర్లు చేసిన పని సర్వత్రా చర్చనీయాంశమైంది.
అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని చంబల్ ఏరియాలో ఈ ఘటన జరగ్గా అందరినీ ఆకట్టుకుంటోంది.
ఇదే ఏరియాలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న అరవింద్ అనే వ్యక్తి కొడుకు మైనర్ కాగా.తన క్లాస్ అయిన మైనర్ అమ్మాయితో లేచిపోయాడు.
ఇక వారిద్దరూ డైరెక్టుగా గోవా వెళ్లిపోయి ఎంజాయ్ చేయాలనుకున్నారు.ఎలాగైనా సరే ఓ హోటల్లో రూమ్ తీసుకోవాలని ప్లాన్ వేశారు కానీ చివరకు అది కాస్తా బెడిసి కొట్టింది.
ఎందుకంటే వారిద్దరి వద్ద ఎలాంటి ఐడెంటిటీ కార్డూ లేక అలాగే ఇన్ఫర్మేషన్ సరిగ్గా చెప్పలేకపోవడంతో వారికి రూమ్ ఇచ్చేందుకు హోటల్ యాజమానులెవరూ ఇష్టపడలేదు.ఇక చేసేది లేక వారిద్దరూ 14 రోజుల వరకు ఆ గోవాలోనే ఫుట్పాత్లపైనే పడుకుంటూ దొరికింది తింటూ దారుణంగా గడిపారు.
ఇక ఇలా అయితే లాభం లేదనుకున్న అమ్మాయి తండ్రికి ఫోన్ చేసి ఎలాగైనా తన ఆధార్ కార్డు పంపాలని కోరింది.అంతేగానీ ఇంటికి వస్తానని మాత్రం అనలేదు.
ఇక దీంతో ఆ తండ్రికి చిర్రెత్తుకొచ్చి బాలుడి పేరెంట్స్పై కిడ్నాప్ కేసు పెట్టి కూతురు కావాలని చెప్పాడు.ఇక వెంటనే రంగంలోకి దిగిన యూపీ పోలీసులు అమ్మాయి చేసిన ఫోన్ ఆధారంగా గోవా పోలీసులకు సమాచారం ఇచ్చేశారు.ఇక గోవా పోలీసులు జల్లెడ పట్టి యూపీ పోలీసులకు ఇద్దరు మైనర్లను అప్పగించేశారు.అయితే ఇది వరకే బాలిక తండ్రి బాలుడి తండ్రిపై కేసు పెట్టడంతో దాని ఆధారంగా కోర్టు తీర్పు మేరకు బాలుడి తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తోంది.
మొత్తానికి ఇద్దరు మైనర్లు చేసిన పని వారి తల్లిదండ్రులను ఇబ్బందుల్లోకి నెట్టింది.