ఈ మధ పెండ్లిలో జరుగుతున్న ఘటనలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.అదేంటో గానీ చివరి నిముషంలో జరిగి ఘటనలు సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్లోనే ఉంటున్నాయి.
ఇక ఇప్పుడు కూడా ఇలాగే పెండ్లి జరుగుతున్న టైమ్లో వరుడికి జరగిన ఓ వింత ఘటన విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.పెళ్లి కొడుకు ఎంతో సంతోషంగా మంచిగా ట్రై చేసి కార్లో సంబురంగా మంటపానికి బయటు దేరాడు.
అయితే ఇదే టైమ్లోనే కొందరు హిజ్రాలు కారును ఆపేసి బక్షీస్ ఇవ్వాల్సిందేనంటూ వెంటపడ్డారు.
ఇక వీరితో గొడవ ఎందుకని భావించిన బంధువులు ఎంతో కొంత సొమ్ము ఇవ్వబోతే హిజ్రాలు ససేమిరీ ఒప్పుకోకుండా అడిగినంత డబ్బు ఇవ్వాల్సిందేనంటూ డిమాండ్ చేశారు.
ఇక వీరితో వాధించి లాభం లేదని, కారులో ఉన్న వరుడు కోపం తెచ్చుకుని పైసా ఇవ్వకుండానే అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయాడు ఇదే గ్యాప్లో.మరి హిజ్రాలు ఇవ్వకుండా వెళ్లిపోతే ఊరుకుంటారా ఊరుకోరు కదా.
వారిలో ఒకరిని పెండ్లి కొడుకు కారుతో గుద్దేసిందంటూ ఆరోపించి సంచలనం రేపారు.
ఇక అబద్ధమంటూ కొడుకు బంధువులు వాదించగా ఏకంగా వారితోనే కొట్లాటకు దిగారు ఆ హిజ్రాలు.అయితే ఈ గొడవ కాస్తా చిలికి చిలికి పెద్దది కావడంతో స్థానికులంతా అక్కడకు చేరుకున్నారు.ఇక మళ్లీ సహనం కోల్పోయిన పెళ్లి కొడుకు ఈ సారి కారును మరింత స్పీడుతో డ్రైవ్ చేస్తూ వేగంగా వెళ్లిపోవడంతొ హిజ్రాలు మరింత రెచ్చిపోయారు.
ఈ సారి మరింత హంగామా సృష్టించారు వారు.స్థానికంగా ఉండే పెట్రోలు బంకులో రచ్చ రచ్చ చేసి పెండ్లి వారిని మొత్తం ఆపేశారు.ఇక చివరకు పోలీసులు వచ్చి నచ్చజెప్పడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.మొత్తానికి హిజ్రాలు ఎంత పనిచేశారు కదా.