సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లలో కొంతమంది హీరోయిన్లు పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంటే మరి కొందరు హీరోయిన్లు మాత్రం సినిమాలకు దూరమై ఇతర దేశాల్లో స్థిరపడ్డారు.టాలీవుడ్ హీరోయిన్లలో ఎక్కువమంది హీరోయిన్లు అబ్రాడ్ లో స్థిరపడ్డారు.
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలతో కలిసి నటించడంతో పాటు యంగ్ జనరేషన్ హీరోలతో రంభ ఆడిపాడారు.
రంభకు ముగ్గురు పిల్లలు కాగా ప్రస్తుతం రంభ కెనడాలో ఉన్నారని తెలుస్తోంది.
మహేష్ బాబు భార్య నమ్రతకు అక్క అయిన శిల్పా శిరోద్కర్ ప్రస్తుతం దుబాయ్ లో నివశిస్తున్నారు.శిల్పా తెలుగులో బ్రహ్మ అనే సినిమాలో నటించగా ఆ సినిమా తర్వాత తెలుగులో ఆఫర్లు వచ్చినా ఇతర ఇండస్ట్రీలకే పరిమితమయ్యారు.
టాలీవుడ్ అగ్ర హీరోలందరికీ జోడీగా నటించిన మాధవి ప్రస్తుతం న్యూజెర్సీలో నివాసం ఉంటున్నారు.
ఆపద్భాంధవుడు సినిమాలో హీరోయిన్ గా నటించిన మీనాక్షి శేషాద్రి ప్రస్తుతం టెక్సాస్ లో నివశిస్తున్నారు.ప్రేమంటే ఇదేరా సినిమాలో నటించి యువతలో క్రేజ్ ను పెంచుకున్న ప్రీతీ జింటా ప్రస్తుతం లాస్ ఏంజెల్స్ లో నటిస్తున్నారు.తెలుగు కంటే ఈ బ్యూటీ బాలీవుడ్ సినిమాలకే ఎక్కువగా ప్రాధాన్యతనిస్తుండటం గమనార్హం.
మరో హీరోయిన్ మల్లికా షెరావత్ ప్రస్తుతం లాస్ ఏంజెల్స్ లో నివాసం ఉంటున్నారు.
మిర్చీలో ప్రభాస్ కు జోడీగా నటించి గుర్తింపు తెచ్చుకున్న రిచా గంగోపాధ్యాయ ప్రస్తుతం యూ.ఎస్.ఏలో ఉన్నారు.ఎంబీఏ చదివే సమయంలో క్లాస్ మేట్ ను ప్రేమించిన రిచా గంగోపాధ్యాయ ఈ ఏడాది మే నెలలో మగబిడ్డకు జన్మనిచ్చారు.రిచా గంగోపాధ్యాయ తెలుగులో రీఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
వరుసగా ఆఫర్లు ఉన్న సమయంలోనే సినిమా ఇండస్ట్రీకి ఈ బ్యూటీ గుడ్ బై చెప్పడం గమనార్హం.మరి కొందరు హీరోయిన్లు కూడా పెళ్లి తర్వాత విదేశాల్లో స్థిరపడ్డారు.