ఊహలు గుసగుసలాడే సినిమాతో తెరంగేట్రం చేసిన రాశీఖన్నా టాలీవుడ్ లో ఇతర ఇండస్ట్రీల్లో పదుల సంఖ్యలో సినిమాలు చేసి యూత్ ఫేవరెట్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచారు.ఎన్టీఆర్ కు జోడీగా జై లవకుశ సినిమాలో రాశీఖన్నా నటించగా ఆ సినిమా సక్సెస్ సాధించినా రాశీఖన్నాకు ఆఫర్లు అంతగా పెరగలేదు.
అయితే ఈ హీరోయిన్ ఫేవరెట్ యాక్టర్ కోలీవుడ్ హీరో కావడం గమనార్హం.
ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2తో సక్సెస్ సాధించిన రాజ్ అండ్ డీకే షాహిద్ కపూర్, రాశీఖన్నా జంటగా భారీ వెబ్ సిరీస్ ను నిర్మించడానికి సిద్ధమవుతున్నారు.
ఈ భారీ వెబ్ సిరీస్ లో కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నారు.విజయ్ సేతుపతితో ఇప్పటికే కలిసి నటించిన రాశీఖన్నా మరోసారి అతనితో కలిసి పనిచేసే అవకాశం రావడంతో సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు.
తన ఫేవరెట్ హ్యూమన్ మరియు యాక్టర్ అయిన విజయ్ సేతుపతితో మూడోసారి కలిసి నటిస్తున్నానని రాశీఖన్నా తెలిపారు.బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ సైతం తనను సెట్ మీదకు త్వరగా పిలవాలని కోరారు.
తొలిసారి షాహిద్ కపూర్ తో కలిసి నటిస్తున్న రాశీఖన్నా బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా సత్తా చాటుతారేమో చూడాల్సి ఉంది.విజయ్ సేతుపతి ఇప్పటికే తన టాలెంట్ తో అవకాశాలు అందిపుచ్చుకుంటుండగా ఈ వెబ్ సిరీస్ అతని కెరీర్ కు మరింత ప్లస్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
విజయ్ సేతుపతితో స్క్రీన్ షేర్ చేసుకోవడం సంతోషంగా ఉందని షాహిద్ కపూర్ తెలిపారు.సెట్ లో రాశీఖన్నాకు తాను బాగా అలవాటు పడిపోయానని షాహిద్ కపూర్ అన్నారు.ఈ మధ్య కాలంలో ఆఫర్లు తగ్గిన రాశీఖన్నా వెబ్ సిరీస్ తో మళ్లీ బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.