వైసిపి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సిబిఐ కోర్టులో పిటిషన్ వేయడం తెలిసిందే.ఈ పిటిషన్ పై గత కొద్ది వారాల నుండి.
సిబిఐ న్యాయస్థానం వాదనలు విని ఆగస్టు 25 వ తారీకు తుది తీర్పు ఇవ్వడానికి రెడీ అయింది.ఇటువంటి తరుణంలో మాజీ ఎంపీ చింతా మోహన్.
మాట్లాడుతూ వైయస్ జగన్ రాజకీయ పతనం ప్రారంభం అయిందని షాకింగ్ కామెంట్లు చేశారు.
బెయిల్ రద్దు కాకుండా ఓ కేంద్ర మంత్రి కుమారుడి సాయం కోసం జగన్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.రాష్ట్రంలో రాజకీయ మార్పు రావడం గ్యారంటీ అని, వైఎస్ జగన్ మాజీ అవడం తథ్యం అని జోస్యం చెప్పారు.జగన్ బెయిల్ రద్దు కేసులో సీబీఐ తీరు వివాదాస్పదంగా ఉందని స్పష్టం చేశారు.
దీంతో ఇప్పుడు చింతా మోహన్ చేసిన కామెంట్ ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారాయి.