బుల్లితెరపై సుడిగాలి సుధీర్ షోలు, ఈవెంట్లు చేస్తూ పాపులారిటీని పెంచుకుంటుండగా కొన్ని సినిమాల్లో సుధీర్ హీరోగా సైతం నటిస్తున్నారు.అయితే హీరోగా కంటే జబర్దస్త్ షో ద్వారానే సుడిగాలి సుధీర్ కు పాపులారిటీ పెరగడం గమనార్హం.
తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో రిలీజ్ కాగా ప్రొమోలో సుధీర్ పై సింగర్ మనో పంచ్ లు వేశారు.ప్రోమోలో రామ్ ప్రసాద్ గెటప్ శ్రీనుతో ఈ 2,000 రూపాయలు దీనికి ఇచ్చెయ్యి అని చెబుతాడు.
ఇది చెల్లదురా అని గెటప్ శ్రీను సమాధానం ఇవ్వగా అక్కదది చెల్లిది కాదు అని పంచ్ వేస్తారు.నరేష్ ఏందన్నా ఇలా ఊగుతున్నాను అని అడగగా ట్రైన్ కదా ఇలానే ఊగుతాం అని చెబుతాడు.
మరి నువ్వు ఊగట్లేదే అని నరేష్ అడగగా ఇంకా నా టికెట్ కన్ఫామ్ కాలేదని చెబుతాడు.శ్రీను పంచె విప్పుతుండగా రోహిణి ఏం చేస్తున్నారని అడుగుతుంది.శ్రీను పిల్లాడికి ఊయల కడుతున్నానని చెప్పగా రోహిణి పిల్లాడు ఎక్కడ అని అడుగుతుంది.
ఆ ప్రశ్నకు శ్రీను సమాధానంగా ప్లాన్ చేస్తున్నామని చెబుతాడు.నా వల్ల కాదని గెటప్ శ్రీను భార్య పాత్ర వేసిన యువతి చెప్పగా నీతో కాదని వెల్లడిస్తాడు.జబర్దస్త్ కమెడియన్ మనోతో మేం చాలా పేదవాళ్లం సార్ మీ ఆస్తి మాకు రాసిస్తారా అని అడగగా మీనా ఇస్తానని చెబుతాడు.ప్రళయం వస్తే ఇళ్లు పడిపోతాయని చెప్పగా ఇళ్లు పడకపోతే ఇంద్రజ పడుతుందా ? అని మనో చెబుతాడు.మనో నేను లోపలికి వెళ్లి దేవుడికి సుధీర్ ను పెడతానని చెబుతాడు.
హైపర్ ఆది సుధీర్ ను పెడతారా అని అడగగా అదే దద్దోజనం అని సుధీర్ పై మనో కామెంట్ చేస్తారు.మనో వేసిన పంచ్ సుధీర్ ను అవమానించేలా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.