లాక్ డౌన్ దెబ్బకు సినిమా పరిశ్రమ చాలా ఇబ్బందులు పడింది.చాలా సినిమాల షూటింగులు నిలిచిపోయాయి.
అంతకు మించి సినిమాల విడుదల ఆగిపోయింది.పలు సినిమాల విడుదల వాయిదా పడింది.
మరికొన్ని సినిమాలు ఓటీటీల్లో విడుదలయ్యాయి.ఉన్న సినిమాలను కంప్లీట్ చేయలేకపోవడంతో వాటి రిలీజ్ డేట్లన్నీ వాయిదా పడ్డాయి.
ప్రస్తుతం పరిస్థితులు చక్కబడుతున్నాయి అనుకుని రిలీజ్ డేట్స్ ప్రకటించిన బాలీవుడ్ టాప్ హీరో అక్షయ్ కుమార్ మరోసారి తన సినిమా రిలీజ్ ను వాయిదా వేయాల్సి వచ్చింది.లాక్ డౌన్ మూలంగా అక్షయ్ కోలుకోలేని దెబ్బతిన్నాడు.
ఏడాదికి మూడు నుంచి నాలుగు సినిమాలు రిలీజ్ చేస్తాడు అక్షయ్ కుమార్.కరోనా దెబ్బకు కనీసం సగం సినిమాలు కూడా రిలీజ్ చేయలేకపోతున్నాడు.కరోనా సెకెండ్ వేవ్ తర్వాత ఫస్ట్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు అక్షయ్.అయితే మరోసారి ఈ డేట్ ను పోస్ట్ పోన్ చేసినట్లు వెల్లడించాడు.
అక్షయ్ కుమార్, వాణి కపూర్, హ్యూమా ఖురేషి, లీడ్ రోల్స్ చేస్తున్న సినిమా బెల్ బాటమ్.ఈ సినిమాను జులై 27న వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
అయితే తాజాగా ఈ సినిమా విడుదలను ఆగస్ట్ 19కి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.
నిజానికి లాక్ డౌన్ మూలంగా బాలీవుడ్ లో ఎక్కువగా నష్టపోయిన హీరో అక్షయ్ కుమార్.ఏడాదిని నాలుగు సినిమాలు రిలీజ్ కావాల్సి ఉన్నా మిస్సయ్యాడు.ఈ సినిమాల విడుదల వాయిదా పడటంతో కొత్త సినిమాలకు కమిట్మెట్స్ ఇవ్వడం లేదు.
గతేడాది ఏప్రిల్ లో విడుదల కావాల్సిన సూర్యవన్షీ ఇప్పటికే విడుదల కాలేదు.బిగ్గెస్ట్ మల్టీసారర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో తెలియని పరిస్థితి ఉంది.
అటు తను నటించి మరో సినిమా లక్ష్మీ.ఈ సినిమాను కూడా ఓటీటీలోనే విడుదల చేశారు.
సినిమాకు 100 కోట్లు అనుకున్నా దాదాపు వెయ్యికోట్ల మార్కెట్ ఉన్న అక్షయ్ప్రస్తుతం తన సినిమాలు విడుదల కాకపోవడంతో దిగాలుగా ఉన్నాడు.ప్రస్తుతం ఆయన రామ్ సేతు, బచ్చన్ పాండే, పృథ్వీ రాజ్, అతరంగీ, రక్షా బంధన్ సినిమాలు చేశాడు.ఇవి విడుదల అయితేనే కొత్త సినిమాలకు ఓకే చెప్పే అవకాశం ఉంది.