మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ మరోసారి ఇద్దరు కలిసి బాక్సాఫీస్ ఫైట్ కు సిద్ధం అవుతున్నారా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.బాలయ్య బాబు అఖండ, మెగాస్టార్ ఆచార్య రెండు సినిమాలు దసరా రేసులో నిలుస్తాయని అంటున్నారు.
కరోనా సెకండ్ వేవ్ వల్ల మే నెల నుండి సినిమాల రిలీజ్ లు వాయిదా పడుతూ వచ్చాయి.ప్రస్తుతం థియేటర్లు తెరచుకున్నా ఆడియెన్స్ వస్తారా రారా అన్న డౌట్ ఉంది.
లేటెస్ట్ గా రెండు చిన్న సినిమాలు రిలీజ్ కాగా వాటికి పెద్దగా రెస్పాన్స్ వచ్చినట్టుగా లేదు.అయితే దసరా వరకు పరిస్థితి మెరుగుపడొచ్చని టాక్.అందుకే చిరు, బాలయ్య దసరా టార్గెట్ తో తమ సినిమాలతో వస్తున్నారు.చిరు ఆచార్యతో బాలయ్య అఖండ పోటీకి రెడీ అవుతున్నారట.
రెండు సినిమాలు ఒకేసారి రిలీజైతే మరోసారి మెగా నందమూరి బాక్సాఫీస్ ఫైట్ బీభత్సంగా ఉంటుందని చెప్పొచ్చు.ఈ సినిమాల మధ్య ఫైట్ ఫ్యాన్స్ రచ్చ చేయడం కన్ ఫర్మ్ అని చెప్పొచ్చు.
మరి నిజంగానే చిరు, బాలయ్య ఒకేసారి వస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. అయితే అక్టోబర్ 13న ఆల్రెడీ ఆర్.ఆర్.ఆర్ వస్తుంది కాబట్టి అదే నెలలో వచ్చే దసరాకి చిరు, బాలయ్య అంత పెద్ద రిస్క్ తీసుకునే అవకాశం లేదని కొందరు అంటున్నారు.