తెలుగులో “పిల్ల నువ్వు లేని జీవితం” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయమైన మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు “సాయి ధరమ్ తేజ్” గురించి కొత్తగా సినీ ప్రేక్షకులకు తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే సాయి ధరమ్ తేజ్ ఈ మధ్య కాలంలో హిట్టూ, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకు పోతున్నాడు.
అయితే ఈ మధ్య సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటున్నాడు.
కాగా తాజాగా సాయి ధరమ్ తేజ్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే సాయి ధరమ్ తేజ్ తన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ ని చూపిస్తూ “అదుర్స్” చిత్రంలో బ్రహ్మానందం చెప్పినటువంటి నా రక్తం తాగేయ్ వే, అయిపోయింది అయిపోయిందంటూ తాగేస్తుంటే అయిపోక ఉంటుందా… అయినా ఎంతని తెను, ఎక్కడనుంచి తేను అనే డైలాగ్ ని బ్యాక్ గ్రౌండ్ లో ప్లే చేశాడు.దీంతో కొందరు అభిమానులు ఈ వీడియోని షేర్ చేస్తూ తెగ ట్రోల్స్ చేస్తున్నారు.
అంతేకాకుండా “ఆ బైకుని నీ లాంటి స్టార్ సెలబ్రిటీలే పోషించ లేకపోతే మాలాంటి సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు అన్న” అంటూ కామెంట్లు చేస్తున్నారు.అయితే మరికొందరు మాత్రం ప్రస్తుతం ఉన్న పెట్రోల్ రేట్లను సాయి ధరమ్ తేజ్ చాలా ఫన్నీగా ట్రోల్ చేశాడంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ తెలుగులో “రిపబ్లిక్” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ కి జోడిగా కోలీవుడ్ ప్రముఖ హీరోయిన్ “ఐశ్వర్య రాజేష్” హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే ఈ చిత్రంలో ప్రముఖ సీనియర్ నటుడు జగపతి బాబు, రమ్య కృష్ణ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తుండగా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు దేవ కట్టా దర్శకత్వం వహిస్తున్నాడు.