2017వ సంవత్సరంలో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు “సంపత్ నంది” దర్శకత్వం వహించిన “గౌతమ్ నంద” చిత్రం సినీ ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తు ఉంటుంది.అయితే ఈ చిత్రంలో హీరోగా యాక్షన్ హీరో గోపీచంద్ నటించి ద్వి పాత్రాభినయం చేయగా హీరోయిన్ గా హన్సిక మొత్వాని, క్యాథరిన్ తెరిసా తదితరులు నటించారు.
అలాగే ఈ చిత్రంలో ప్రముఖ నటులు ముకేశ్ రిషి, సచిన్ ఖేడేకర్, సీత, చంద్ర మోహన్, తనికెళ్ల భరణి, అన్నపూర్ణ, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.అయితే నాలుగేళ్ల క్రితం ఈ చిత్రం విడుదలైనప్పుడు ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.
కానీ సంవత్సరాలు గడిచే కొద్దీ ఈ చిత్రం టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు తెగ నచ్చుతోంది.
అయితే ఈ చిత్రం విడుదలయ్యి ఇటీవలే 4 సంవత్సరాలు పూర్తవడంతో చిత్ర యూనిట్ సభ్యులు సోషల్ మీడియా ద్వారా స్పందించారు.
ఇందులో భాగంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు సంపత్ నంది మాట్లాడుతూ ఈ చిత్రం విడుదలై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు చిత్ర యూనిట్ సభ్యుల కి శుభాకాంక్షలు తెలియజేశాడు.అలాగే తాను ఈ చిత్రం విడుదలైనప్పుడు మొదటి రోజు మొదటి షోకి చికాగోలో తన కుటుంబ సభ్యులతో వెళ్లి చూశానని అప్పుడు తనకి ఈ చిత్రం చాలా బాగా నచ్చిందని కానీ బయట మాత్రం ఫ్లాప్ టాక్ వినిపించిందని చెప్పుకొచ్చాడు.
కానీ సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ చిత్రం అండర్ రేట్, స్టైలిష్, సూపర్ కాన్సెప్ట్ అని పొగుడుతున్నారని కానీ తనకు ఈ విషయం ఏ మాత్రం అర్థం కావడం లేదని బహుశా విస్కీ మాదిరిగా ఏండ్లు గడిచే కొద్దీ టేస్ట్ మారినట్లు సినిమాలు కూడా రుచిగా మారుతాయేమో అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం “సంపత్ నంది” తెలుగులో “సిటీమార్” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.కాగా ఈ చిత్రంలో హీరోగా గోపీచంద్ నటిస్తుండగా హీరోయిన్ గా తమన్నా భాటియా నటిస్తోంది.కాగా ఈ చిత్రం కబడ్డీ ఆట బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్నట్లు సమాచారం.
ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు విడుదల కాగా మంచి స్పందన లభించంది.అయితే దర్శకుడు సంపత్ నంది ఒకపక్క చిత్రాలకు దర్శకత్వం వహిస్తునే మరోపక్క పలు చిత్రాలకు కథలను అందిస్తున్నాడు.
అంతే కాకుండా సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు.