పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత వకీల్ సాబ్ సినిమాతో వచ్చి సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఎప్పుడూ లేనంత ఫాస్ట్ గా సినిమాలను పూర్తి చేస్తున్నాడు.ప్రస్తుతం పవన్ క్రిష్ దర్శకత్వంలో ”హరిహర వీరమల్లు” సినిమాలో నటిస్తున్నాడు.
ఈ సినిమా ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.
మొన్నటి వరకు కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా మళ్ళీ షూటింగ్ రీస్టార్ట్ చేసారు.
ఈ సినిమాలో పవన్ కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుంది.ఇప్పటికే విడుదల ఆయిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో పవన్ లుక్ అందరిని ఆకట్టుకుంది.పవన్ ఈ సినిమా చేస్తూనే ”అయ్యప్పనుమ్ కోషియం” అనే మలయాళ రీమేక్ సినిమాలో కూడా నటిస్తున్నారు.ఈ సినిమాలో పవన్ తో పాటు దగ్గుబాటి రానా కూడా ప్రధాన నటిస్తున్నాడు.
ఈ సినిమా యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్నాడు.
ఇందులో పవన్ కు జోడీగా నిత్యా మీనన్, రానాకు జోడీగా ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ కూడా చాలా వరకు పూర్తి చేసారు.కరోనా తర్వాత మళ్ళీ షూటింగ్ ఇప్పుడు రీస్టార్ట్ చేసారు.
ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే మరియు మాటలు అందిస్తున్నాడు.ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు.
థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.
అయితే ఈ సినిమాను సంక్రాంతి బరిలోకి దించబోతున్నట్టు పవన్ తెలిపారు.మన టాలీవుడ్ లో సంక్రాంతి అతి పెద్ద పండగ.అందుకే ఈ సినిమా సంక్రాంతి రేస్ లోకి రావడంతో ఏ డేట్ కు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
అయితే తాజా సమాచారం ప్రకారం.ఈ సినిమా జనవరి 12 న విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది.మరి చూడాలి ఈ సినిమా ఏ డేట్ కు ఫిక్స్ చేస్తారో.