మాజీ మంత్రి బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ హుజరాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.మంత్రిగా తాను ఉన్న సమయంలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని ఇంటింటికి వివరిస్తూ అదే రీతిలో ప్రస్తుత ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ను బయటకు తీసుకొచ్చిలా.
ప్రజలను ఆకర్షించేలా పాదయాత్రలో భాగంగా ఈటల ఇంటింటికి తిరుగుతూ వివరిస్తూ వస్తున్నారు.ఎలాగైనా హుజరాబాద్ ఉప ఎన్నికలలో గెలవాలని సత్తా చాటాలని పాదయాత్రను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈటల తాజాగా అస్వస్థతకు గురయ్యారు.
దీంతో పార్టీ నాయకులు మొదట నిమ్స్ లో జాయిన్ చేయగా తర్వాత హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది.ఇటువంటి తరుణంలో ఈటల రాజేందర్ నీ ఆసుపత్రిలో పరామర్శించడానికి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు పలువురు బీజేపీ నేతలు రావడం జరిగింది.
ఈ సందర్భంగా అక్కడ ఉన్న వైద్యులను ఈటల రాజేందర్ యొక్క ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ క్రమంలో ఈటల ఆరోగ్యం కుదుట పడిన తర్వాత మళ్లీ పాదయాత్ర స్టార్ట్ అవుతుందని ఈ లోపు మిగతా బిజెపి పార్టీ నాయకులు చేస్తున్న కార్యక్రమాలు హుజూరాబాద్ నియోజకవర్గం లో కొనసాగుతాయని బిజెపి నాయకులు తెలిపారు.