టిడిపి నాయకులు మాజీ మంత్రి దేవినేని ఉమ ఇటీవల అరెస్టయిన సంగతి తెలిసిందే.ఉమా అరెస్టుతో తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర స్థాయి లో వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు.
అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులలో పార్టీ నాయకులను ఇరికిస్తున్నరని మండిపడుతున్నారు.ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు లతోపాటు కుట్ర హత్యాయత్నం కింద పలు సెక్షన్ల పై కేసు నమోదు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలు కి దేవినేని ఉమా ని పోలీసులు తరలించడం జరిగింది.
ఈ సందర్భంగా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తాజాగా దేవినేని ఉమా కుటుంబసభ్యులను పరామర్శించారు.బొమ్మ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి పార్టీ అండగా ఉంటుందని తెలిపి దేవినేని ఉమా ఇంటి వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
చంద్రబాబు రావడంతో దేవినేని ఉమా ఇంటి వద్ద భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు దేవినేని ఉమా పై పెట్టిన కేసులు అక్రమ కేసులు అని మండిపడ్డారు.ఎం జిటి మైనింగ్ లో అక్రమాలు జరిగాయని.కచ్చితంగా తెలియజేసిందని ప్రభుత్వంపై విమర్శించారు.అదే రీతిలో ముఖ్యమంత్రి ఒక సైకో అని కేవలం తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని రాష్ట్రంలో సంక్షేమం అదేరీతిలో అభివృద్ధిని గాలికొదిలేశారని చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు చేశారు.ఎన్ని అక్రమ కేసులు తెలుగుదేశం పార్టీ నేతలపై పెట్టిన భయపడే ప్రసక్తే లేదని తర్వాత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పోలీసులను ఉద్దేశించి అదే రీతిలో అధికారులను ఉద్దేశించి చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.