ప్రముఖ సినీ దర్శకుడు దాసరి నారాయణ రావు సినిమా ఇండస్ట్రీలో ఏ విధమైనటువంటి గుర్తింపును సంపాదించుకున్నారో మనకు తెలిసిందే.సినిమా పెద్దగా ఉంటూ బాధ్యతలను నిర్వహిస్తున్నటువంటి దాసరి నారాయణరావు కుమారులు దాసరి ప్రభు, దాసరి అరుణ్ పై పోలీసు కేసు నమోదయ్యింది.
కేవలం తమ వద్ద తీసుకున్న అప్పును చెల్లించమన్నందుకే తమని చంపేస్తామని దాసరి కుమారులు బెదిరించినట్లు వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
గుంటూరు జిల్లాకు చెందిన అట్లూరి సోమశేఖర్ రావు అనే వ్యక్తి ఎల్లారెడ్డిగూడలో నివసిస్తున్నారు.
ఇతనికి దాసరి నారాయణరావుతో ఎంతో అనుబంధం ఉంది.ఈ అనుబంధం కారణంగానే దాసరి ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పుడు సోమశేఖర్ దగ్గరనుంచి అప్పుగా రూ.2.10 కోట్ల రూపాయలను తీసుకున్నారు.అయితే అప్పు తీసుకున్న తరువాత కొద్ది రోజులకు దాసరి నారాయణ రావు మృతి చెందాడు.
దాసరి మృతి అనంతరం పెద్దల సమక్షంలో సోమశేఖర రావు దాసరి కుమారులు అరుణ్, ప్రభు లను రూ.2.10 కోట్ల రూపాయలకు బదులుగా.1.15 కోట్ల రూపాయలు చెల్లించాలని తీర్మానించారు.
అయితే దాసరి మరణించినప్పటి నుంచి ఇప్పటివరకు వారు డబ్బులు చెల్లించకపోవడంతో సోమ శేఖర్ రావు ఈ నెల 27వ తేదీన జూబ్లీహిల్స్ లో రోడ్డు నెంబర్ 46లోని దాసరి నారాయణరావు గారి ఇంటికి వెళ్లి డబ్బును తిరిగి చెల్లించాలని వారి కుమారులకు తెలిపారు.ఈ క్రమంలోనే దాసరి కుమారులు ఆ డబ్బును తిరిగి చెల్లించేదేలేదంటూ.ఇంకొక సారి డబ్బు విషయమే ఇంటికి వస్తే చంపేస్తామని బెదిరించడంతో సోమశేఖర రావు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో దాసరి కుమారుల పై ఫిర్యాదు చేయడంతో జూబ్లీహిల్స్ పోలీసులు వారిపై పలు సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు.