సమాజంలో ఎంతోమంది కష్టపడి అనేక రకాల ఉద్యోగాలు సంపాదించి వారి జీవనం కొనసాగిస్తూ ఉండటం సహజమైన ప్రక్రియ.అయితే మన దేశంలో చాలా తక్కువ మంది మాత్రమే ఐఏఎస్ ఐపీఎస్ లాంటి క్యాడర్ ల కోసం సివిల్ సర్వీసుల పరీక్షలకు హాజరై అందులో అవ్వడం అంటే అంత ఆషామాషీ విషయం కానేకాదు.
అయితే అలా అతి తక్కువ మందిలో ఈ ఉద్యోగాన్ని సొంతం చేసుకునే వ్యక్తులలో కొంతమంది స్వచ్ఛంద పదవీ విరమణను పొందిన వారిని కూడా మనం గమనిస్తూనే ఉంటాం.అయితే తాజాగా ఓ సీనియర్ ఐపిఎస్ అధికారిని స్వచ్ఛంద పదవీ విరమణకు అనుమతి ఇవ్వాలంటూ చీఫ్ సెక్రటరీకి తాజాగా లేఖ రాసింది.
తాను ఇంతకాలం ప్రజా సేవ చేశానని.ఇక నుండి దైవ సేవ చేసుకుంటానంటూ ఆ మహిళ ఐఏఎస్ అధికారిని స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసింది.
ముందుగా ఈ మహిళ ఐపీఎస్ అధికారిని విరమణ చేసినందుకు ఎవరు ఆశ్చర్యం పడలేదు కానీ తాను ఎందుకు పదవి విరమణ చేస్తున్న కారణం విని చాలా మంది షాక్ అయ్యారు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.
పంజాబ్ రాష్ట్రంలోని ఐపీఎస్ అధికారిగా పనిచేస్తున్న భారతి ఆరోర తాజాగా తాను చేస్తున్న ఐపీఎస్ ఉద్యోగానికి స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయాలని అనుకుంది.ఇందుకు సంబంధించి ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు.
ఇందులో భాగంగా ఆవిడ ఈ విధంగా తెలిపింది.తాను జీవితంలో అసలు నా లక్ష్యం దిశగా ప్రయాణం చేయాలనుకుంటున్నానని కబీర్ దాస్, తులసి దాస్, గురు నానక్ దేవ్ లాంటి మహానుభావులు చూపించిన దారిలోనే తాను ఇకపై ముందుకు వెళ్తానని ఇక ముందు తన జీవితాన్ని పూర్తిగా కృష్ణపరమాత్మ సేవకు అంకితం చేస్తాను అని ఐపీఎస్ అధికారిని భారతి తన లేఖలో తెలిపింది.
దేశంలో వివిధ చోట్ల 23 ఏళ్ల పాటు తన సర్వీసును అనేక స్థాయిలలో పని చేసింది.ప్రస్తుతం భారతి అరోరా హర్యానా రాష్ట్రంలోని అంబాల రేంజ్ లో ఇన్స్పెక్టర్ జనరల్ గా పని చేస్తోంది.ప్రస్తుతం ఈవిడ తెలిపిన కారణం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.ఈ విషయం సంబంధించి తాజాగా మీడియా ఆవిడను సంప్రదించగా ఆవిడ మాట్లాడుతూ తాను ఉద్యోగం పట్ల అమితమైన ఆసక్తి కలిగి ఉందని తాను చేసిన బాధ్యతలు తనకు ఎంతో గర్వకారణం అని చెప్పుకొచ్చింది.
నా పదవి విరమణ కు సంబంధించి పూర్తి వివరాలను తాను లేఖలో స్పష్టంగా తెలిపినట్లు ఆవిడ పేర్కొంది.