తెలంగాణలో ఇప్పుడు ఏదైనా హాట్ టాపిక్గా ఉందంటే అది హుజూరాబాద్ ఉప ఎన్నిక మాత్రమే.ఎందుకంటే ఈటల రాజేందర్ రాజీనామా చేసిన తర్వాత ఎలాగైనా గెలిచి పంతం నెగ్గించుకోవాలని టీఆర్ ఎస్, అట ఈటల రాజేందర్ పోటా పోటీగా హుజూరాబాద్ లో ప్రచారం చేస్తున్నారు.
ఇప్పటికే నియోజకవర్గంలోని ఊర్లన్నీ కలియ తిరిగేస్తున్నారు ఈ రెండు పార్టీల నేతలు.ఇక టీఆర్ ఎస్ అయితే ఏకంగా ఓ అడుగు ముందుకేసి దళిత బంధులాంటి స్కీమ్ కూడా పెట్టిందంటే ఈ ఎన్నికలను ఎంత సీరియస్గా తీసుకుంటుందో అర్థం చేసుకోవచ్చు.
అటు బీజేపీ కూడా దీన్ని చాలా సీరియస్గానే తీసుకున్నట్టు తెలుస్తోంది.ఇందుకోసం ఇప్పటికే ఈటలను అభ్యర్థిగా ప్రకటించడమే కాకుండా ప్రతి మండలానికి ఓ ఇన్ చార్జిని నియమించింది బీజేపీ.
ఇక ఈటలరాజేందర్ కూడా పాదయాత్రను మొదలు పెట్టి తన ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.అయితే ఈ రెండు పార్టీలు ఇంతలా దూసుకెళ్తున్నా కూడా కొత్తగా కాంగ్రెసకు బాస్ అయిన రేవంత్ మాత్రం దీనిపై పెద్దగా ఫోకస్ పెట్టలేకపోతున్నారు.
మొన్నటి దాకా ఈ పార్టీకి అభ్యర్థి అవుతాడనుకున్న కౌశిక్ రెడ్డి టీఆర్ ఎస్లో చేరడంతో ఇప్పుడు అక్కడ పట్టున్న నేత కోసం వెతుకులాట మొదలైంది.
కాగా ఇక్కడే రేవంత్ ఓ ప్లాన్ వేస్తున్నట్టు తెలుస్తోంది.ఈటల రాజేందర్ బీసీ కావడంతో ఆయనపై బీసీ ఇమేజ్ను ఉపయోగించాలని రేవంత్ చూస్తున్నట్టు తెలుస్తోంది.ఇప్పటికే రేవంత్ ఈ మేరకు సెర్చింగ్ మొదలు పెట్టినట్టు సమాచారం.
ఓసీ నేతలను నిలబెడితే ఎక్కువ శాతం ఓటు బ్యాంకు ఉన్న బీసీల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతో తాను కూడా బీసీనే దింపి ఈటలటకు చెక్ పెట్టాలని చూస్తున్నారంట.అందుకోసమే ఆలస్యం చేస్తున్నట్టు తెలుస్తోంది.
కానీ కొన్ని సార్లు ఆలస్యమే విషం అవుతుందని కూడా రేవంత్కు తెలుసు.మరి ఏం చేస్తారో చూడాలి.