తెలుగులో పలు చిత్రాలకి నిర్మాతగా వ్యవహరించిన ప్రముఖ సినీ నిర్మాత “నట్టి కుమార్” గురించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలియనివారుండరు.కాగా ప్రస్తుతం నిర్మాత నట్టి కుమార్ తెలుగులో “సైకో వర్మ” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
కాగా ఈ చిత్రంలో నూతన హీరో నట్టి క్రాంతి హీరోగా నటిస్తుండగా “అనురాగ్ కంచెర్ల” నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.అయితే ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు పూర్తి అయ్యాయి.
దీంతో చిత్ర యూనిట్ సభ్యులు సెన్సార్ రివ్యూ కోసం దరఖాస్తు చేశారు.కానీ సెన్సార్ బోర్డు సభ్యులు మాత్రం ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చే విషయంలో అభ్యంతరాలు తెలియజేస్తున్నారు.
అంతేకాకుండా ఈ చిత్ర టైటిల్ లోని సైకో అనే పదాన్ని తొలగించాలని చిత్ర యూనిట్ సభ్యులకి సూచిస్తున్నారు.దీంతో సెన్సార్ బోర్డ్ వ్యవహారంపై దర్శకుడు మరియు నిర్మాత నట్టి కుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాకుండా గతంలో కూడా సైకో పేరు మీద పలు చిత్రాలు విడుదలయ్యాయని అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకని ప్రశ్నిస్తున్నాడు.
అంతేకాకుండా సైకో వర్మ చిత్రం టైటిల్ లో సైకో పేరును మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించమని అలాగే ఈ విషయంపై హైకోర్టు కి కూడా వెళతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.మరి సెన్సార్ బోర్డు సభ్యులు ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.అయితే ఈ విషయం ఇలా ఉండగా నట్టి కుమార్ తెలుగులో దాదాపుగా పదికి పైగా చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించాడు.
అలాగే మరో మూడు దర్శకత్వం కూడా వహించాడు.