జీవరాశులన్నిటికి ఆలవాలం ప్రకృతి.కాగా, ప్రకృతిలో రోజురోజుకూ కాలుష్యం పెరిగిపోతుండటం మనం గమనించొచ్చు.
ఈ క్రమంలోనే పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది.అందమైన ప్రకృతి దృశ్యాలను ఎల్లప్పుడు చూసేందుకు వీలు లేకుండా పోతోంది.
అరుదుగానే కొన్ని సుమధుర దృశ్యాలు కనపడే సందర్భాలు ఉంటున్నాయి.ఈ నేపథ్యంలోనే ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో తెలిపే దృశ్యం ఒకటి ప్రస్తుతం తారసపడింది.
దాన్ని చూస్తే చాలు .మీరు వావ్ అనడంతో పాటు ప్రకృతి ఇంత అందంగా ఉంటుందా? అని తెలుసుకుని ముక్కున వేలు వేసుకుంటారండి.ఇంతకీ ఆ దృశ్యాన్ని ఎవరు బంధించారు? ఎక్కడుంది? అనే వివరాలు తెలియాలంటే మీరు ఈ స్టోరీని కంప్లీట్గా చదవాల్సిందే.
ప్రకృతియే ఈ చిత్రాన్ని గీసింది.
అయితే, అన్ని చోట్ల ప్రకృతి గీసిన చిత్రాలను మనం చూడలేం.ప్రత్యేకంగా చల్లటి ప్రదేశాల్లో డిఫరెంట్ అట్మాస్పియర్ ఉంటుంది.
ఉత్తర ధ్రువ కాంతులు.ఇవి ప్రకృతి గీసే చిత్రాలు కాగా, నార్వే, ఐస్లాండ్ లాంటి ప్లేసెస్లోనే ఇవి కనిపిస్తుంటాయి.
ఉత్తర ధ్రువ కాంతులకు ఇక్కడి భూమిపై ప్రతిబింబం కూడా పడుతుంది.ఈ నేఫథ్యంలోనే ప్రకృతి మరింత శోభను సంతరించుకుంటుంది.
అలా అద్భుతమైన ఆహ్లాదాన్ని పంచే ఫొటో ఒకటి ప్రజెంట్ టాక్ ఆఫ్ ఇయర్గా మారింది.
ఈ ఫొటోను ఐస్లాండ్లో లారిన్ రే అనే ఫొటోగ్రాఫర్ క్లిక్ మనిపించారు.ఇది ఈ ఏడాదికి గాను ఆస్ట్రానమీ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ తుది జాబితాకు ఎంపికైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.తన జీవితంలో తీసిన ఉత్తర ధృవ కాంతుల చిత్రాల్లో ఇది బెస్ట్ అని లారిన్ పేర్కొనడం విశేషం.
ఇక ఈ ఫొటోను చూస్తే ప్రతీ ఒక్కరు ప్రకృతికి ప్రణామం చేయాల్సిందే అని అనిపించొచ్చు.మరి మీరు కూడా ఒకసారి చూసి లైక్ లేదా కామెంట్ వేసేసుకోండి.