రచయితగా తనకంటూ ఓ ఫ్రత్యేక గుర్తింపు దక్కించుకున్న బండారు దానయ్య కవి ఇది వరకే దర్శకుడిగా ఒక సినిమాను తెరకెక్కించారు.తాజాగా ఆయన మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు.
ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం చిత్రపటం . పార్వతీశం, శ్రీవల్లి లు ఈ సినిమాలో పాత్రధారులుగా కనిపించబోతున్నారు.శ్రీ క్రియేషన్స్ పతాకంపై పుప్పాల శ్రీధరరావు నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది.
ఈ చిత్రంలోని నింగిని చూసి నేర్చుకున్న అనే పాటను ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ హైదరాబాద్లో విడుదల చేశారు.
అనంతరం విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ, మంచి కథ, మంచి టైటిల్, చక్కటి సాహిత్యం, సంగీతం మేళవింపు ఈ చిత్రమని దర్శక, నిర్మాతలను, చిత్ర బృందాన్ని అభినందించారు.తప్పకుండా ఈ సినిమా విజయాన్ని సొంతం చేసుకుంటుందంటూ నమ్మకం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు బండారు దానయ్య కవి మాట్లాడుతూ, ఇంటర్నెట్ లో మనిషికి కావలసినవి చాలా దొరుకుతున్నాయి.దొరకనిదల్లా ఎమోషన్ మాత్రమే.దాన్ని ఈ చిత్రంలో ఆసక్తికరంగా చూపించే ప్రయత్నం చేశాం.తండ్రికీ, కూతురికి మధ్య సాగే కథతో ఈ చిత్రం సాగుతుంది.
ఇందులో ఏడు పాటలు ఉన్నాయి.వాటికి నేనే సాహిత్యం అందించడంతో పాటు సంగీతాన్ని సమకూర్చాను.పొయెటిక్ గా ఉంటూనే అన్ని రకాల కమర్షియల్ అంశాలు ఉన్నాయి అని అన్నారు.నిర్మాత పుప్పాల శ్రీధర్ మాట్లాడుతూ త్వరలో ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేస్తామని చెప్పారు.
దర్శక దిగ్గజం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా పాటను ఆవిష్కరిచడం వల్ల సినిమాకు ఒక్కసారిగా బజ్ క్రియేట్ అయ్యింది.ఇన్నాళ్లు పెద్దగా ఎవరు పట్టించుకోని చిత్రపటం గురించి ఇప్పుడు జనాలు చర్చించుకుంటున్నారు.