1.ఈ రోజు సీబీఎస్సీ పరీక్ష ఫలితాలు విడుదల
సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి.మధ్యాహ్నం రెండు గంటలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ( సీబీఎస్సీ ) ఫలితాలను విడుదల చేయనుంది.
2.బీజేపీ బడుగుల ఆత్మగౌరవ పోరు
తెలంగాణ బిజెపి ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద బడుగుల ఆత్మగౌరవం నిర్వహించారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
3.ఈటెల బావమరిది పై పోలీసులకు ఫిర్యాదు
దళితులను అవమానించిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బావమరిది మధుసూదన్ రెడ్డి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ హుజురాబాద్, జమ్మికుంట మండలంలో గురువారం ప్రజాప్రతినిధులు ఎమ్మార్పీఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
4.టీఆర్ఎస్ బీజేపీ మధ్య కొట్లాట
హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది.నియోజకవర్గంలో యూట్యూబ్లో దినోత్సవాలు మధుసూదన్ రెడ్డి దళితులను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని టీఆర్ఎస్, కాదు టిఆర్ఎస్ నాయకులు మార్కింగ్ చేసి ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేస్తున్న బిజెపి నేతలు హుజురాబాద్ చౌరస్తాలో కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
5.ఆగస్ట్ 11 నుంచి ఏపీపీ దరఖాస్తుల స్వీకరణ
అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి ఆగస్ట్ 11 నుంచి 29 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పోలీసు నియామక మండలి తెలిపింది.
6.కొనసాగుతూనే ఉన్న బాన్సువాడ బంద్
ఇచ్చిన పిలుపు మేరకు బాన్సువాడ లో బంద్ కొనసాగుతోంది.గోవులను అక్రమంగా రవాణా చేసిన వ్యక్తులను అరెస్ట్ చేయాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు.
7.ఆగస్ట్ 8 న సినీ యూనియన్ల ఎన్నికలు
తెలుగు సినీ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ పరిధిలో ఉన్న మూడు యునిన్లకు ఆగస్ట్ 8 న ఎన్నికలు నిర్వహిస్తున్నామని ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ తెలిపారు.
8.‘ రైతు నేస్తం ‘ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
రైతు నేస్తం 17 వ వార్షికోత్సవ పురస్కారాలకు దరఖాస్తులు చేసుకోవాలని రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ పద్మశ్రీ డాక్టర్ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు కోరారు.
9.ఏపీ సీడ్స్ జాతీయ అవార్డ్
ఏపీ సీడ్స్ కు జాతీయ అవార్డు దక్కింది.సర్టిఫైడ్ తను అంతకు ముందు రైతులకు పంపిణీ చేసి, రైతులకు లబ్ది చేకూర్చిన కారణంగా, సామాజిక బాధ్యత కింద ఏపీ విత్తానభివృద్ది సంస్థ కు జాతీయ అవార్డ్ దక్కింది.
10.ప్రధాని మోదీకి విహెచ్ లేఖ
ఓబిసీ రిజర్వేషన్ల విధానం ఎత్తివేయాలి ప్రధాన మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు లేఖ రాశారు.
11.వివేకా హత్య కేసు
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ విచారణ 58వ రోజు కొనసాగుతోంది.కదిరికి చెందిన వైసీపీ శ్రేణులు లోకేష్ గోవర్ధన్ లు నేడు విచారణకు హాజరు కానున్నారు.
11.3న ఆర్టీసీ జేఏసీ ముఖ్య కార్యకర్తల సమావేశం
ఆర్టీసీ పరిరక్షణ కోసం ఉద్యమ కార్యాచరణ లో 3న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్రస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం జరుగుతుంది అని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ రాజి రెడ్డి తెలిపారు.
12.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 44,230 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
13.లాక్ డౌన్ కొనసాగింపు పై సీఎం సమీక్ష
రాష్ట్రంలో కరోనా నియంత్రణలో భాగంగా అమలులో ఉన్న శుక్రవారం తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ అధికారులతో సమీక్ష చేపట్టారు.
14.టీకాలు వేయించుకున్న యాత్రికులకు సౌదీ అనుమతి
పవిత్ర పుణ్యక్షేత్రమైన మక్కాను సందర్శించే భక్తులకు సౌదీ అరేబియా శుభవార్త చెప్పింది.రెండు డోసులు పోగొట్టే తలదించుకునే విదేశీ భక్తులు యాత్రకు సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకటించింది.
15.పెగాసస్ పై విచారణకు సుప్రీం ఒకే
దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోన్న పెగాసస్ ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారం పై సుప్రీంకోర్టు విచారణ చేయనుంది.ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్ లను శుక్రవారం స్వీకరించింది.
16.పెళ్లి వార్తలు త్రిష స్పందన
గత కొంతకాలంగా సీనీ నటి త్రిష పెళ్లికి సంబంధించి పెద్ద ఎత్తునే వార్తలు వస్తున్నాయి.దీనిపై తాజాగా త్రిష స్పందించారు.ఇప్పట్లో తనకి పెళ్లి చేసుకునే ఆలోచన ఏదీ లేదని ఆమె క్లారిటీ ఇచ్చారు.
17.ఏపీలో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు
ఏపీ లో రాత్రి కర్ఫ్యూ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
18.ఏపీలో మూడు విమానాశ్రయాలకు అనుమతి
ఏపీలో కొత్తగా మూడు గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలకు కేంద్రం అనుమతులు ఇవ్వగా వాటిలో ఒకటి ఇప్పటికే ప్రారంభమైనట్లు పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్ తెలిపారు.
19.జగన్ కు నా సెల్యూట్ : ఆర్.నారాయణ మూర్తి
పెద్ద సినిమాలకు ఇష్టానుసారంగా టికెట్ ధరలు పెంచుకునే అవకాశం లేకుండా కొత్త జీవో జారీ చేసిన ఏపీ సీఎం జగన్ కు సెల్యూట్ చేస్తున్న అంటూ సినీ దర్శకుడు, నటుడు ఆర్.నారాయణ మూర్తి అన్నారు.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 47,380
24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 48,380.