బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి గురించి అందరికీ పరిచయమే.హిందీతో పాటు కన్నడ, తెలుగు సినిమాలలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇక ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న సోషల్ మీడియా వేదికగా అభిమానులతో టచ్ లో ఉంటుంది.ఇదిలా ఉంటే 2009లో ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకోగా.
ప్రస్తుతం తన భర్త పేరు బాలీవుడ్ లో బాగా హాట్ టాపిక్ గా మారింది.
ఈ మధ్య శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా చేస్తున్న వ్యాపారం గురించి బయట పడిన సంగతి తెలిసిందే.
నీలి చిత్రకరణ చేస్తూ వాటిని పలు యాప్ లతో బయట పెడుతున్నట్లు తెలియగా ప్రస్తుతం ఈ విషయం బాగా వైరల్ గా మారింది.కొందరికి వెబ్ సిరీస్ లలో అవకాశాలు ఇస్తానని తెలిపి వాళ్లతో అలాంటి చిత్రీకరణలు చేస్తున్నట్లు బయటపడింది.
ఇక అప్పటినుండి రాజ్ కుంద్రా గురించి ఏదో ఒక విషయం వైరల్ గా మారుతూనే ఉంది.తాజాగా మరో బోల్డ్ నటి షెర్లిన్ చోప్రా కూడా ఇతడి గురించి కొన్ని నిజాలు బయట పెట్టిన సంగతి తెలిసిందే.
అంతేకాకుండా తన భార్య శిల్పాశెట్టి పై పలు రకాలు వ్యాఖ్యలు కూడా చేశారు.ఈ నేపథ్యంలో ఈ విషయం గురించి తన పరువు పోయిందని పరువు నష్టాన్ని డిమాండ్ చేసింది శిల్పాశెట్టి.ఇప్పటివరకు ఈ విషయం గురించి స్పందించని శిల్పా శెట్టి తాజాగా మీడియా ముందుకు వచ్చి కొన్ని విషయాలు తెలిపింది.మీడియాపై బాగా విరుచుకుపడింది.తనను కూడా ఈ కేసులో భాగం చేశారని తెలిపింది.
తన భర్త పై వస్తున్న ఆరోపణల గురించి తాను కూడా కొన్ని విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో.29 మంది మీడియా వ్యక్తులు, మీడియా సంస్థల పై ఫైర్ అయ్యింది.తప్పుడు రిపోర్టింగ్ చేశారంటూ తమ ఇమేజ్ ను డ్యామేజ్ చేసినందుకు రూ.25 కోట్ల నష్టాన్ని చెల్లించాలని డిమాండ్ చేసింది.దీంతో ఈ కేసును వార్తా సంస్థ ఏ ఎన్ ఐ రేపు విచారించినట్లు తెలిపింది.
ఇక మీడియాను తప్పుడు రిపోర్టింగ్ చేయకూడదని కోరింది.