ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యలు చేశారు.బ్రిటిష్ వాళ్లది అదే విధంగా జగన్ మనస్తత్వం రెండు ఒకటే అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం లో ఇటీవల దళిత వర్గాలకు చెందిన వారు మతం మారలేదని అధికార పార్టీకి చెందిన నాయకులు దాడి చేశారని ఆరోపణలు చేశారు.ఇటీవల గోవధ నిషేధం పై ఎమ్మిగనూరు ఎమ్మెల్యే… చేసిన కామెంట్లకు ఏపీ రాష్ట్ర బిజెపి కార్యవర్గం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకి పిలుపునివ్వడం జరిగింది.
ఈ సందర్భంగా విజయవాడలో నిర్వహించిన ఆందోళన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సోము వీర్రాజు ఈ రీతిగా వ్యాఖ్యలు చేశారు.
ఎక్కడా కూడా బలవంతపు మతమార్పిడి అనేదానికి బీజేపీ పార్టీ ఊరుకునేది లేదని ఉపేక్షించేది అని పేర్కొన్నారు.అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉన్నట్లు సోము వీర్రాజు ఆరోపణలు చేశారు.అదే రీతిలో రాష్ట్రంలో రోడ్లు గుంతలు వాటిపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ దుమ్మెత్తిపోశారు.
కనీసం రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి రెండు వేల కోట్ల రూపాయలు కూడా కేటాయించలేని పరిస్థితి లో ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు.కేవలం సంక్షేమ కార్యక్రమాలను నవరత్నాలు అమలు చేయటం అనేది మాత్రమే అభివృద్ధి అన్నట్టుగా వ్యవహరిస్తుందని సోము వీర్రాజు వ్యంగ్యంగా విమర్శలు చేశారు.
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల విషయంలో కేంద్రం యొక్క సహకారం కూడా ఉందని సోము వీర్రాజు తెలిపారు.