సాధారణంగా నీటిలో నుంచి ఏదైనా బైక్ వెళ్తుంటేనే ఆ సీన్ చూడటానికి చాలా అదుర్స్ అన్నట్టు ఉంటుంది.ఇక అప్పుడప్పుడు చెరువు మధ్యలోంచి ట్రైన్ వెళ్తుంటే ఇంక ఆ సీన్ చూడటానికి ఎలా ఉంటుంది.
చాలా వండర్కదా.కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయేది నిజంగా చాలా అదుర్స్ అనేలా ఉంటుంది.
ఎందుకంటే దూద్సాగర్ జలపాతం అంటే తెలియని వారుండరేమో.ఎందుకంటే భారత్లో ఉన్న జలపాతాల్లో దీనికి అతి పొడవైన జలపాతంగా గుర్తింపు తెచ్చుకుంది.
ఇది ఈ మాండవీ నది అనేది మన పక్కనే ఉన్న కర్ణాటకలోని బెలగావి నుంచి మొదలవుతుంది.
అయితే అది చాలా దూరం ప్రయాణించి పశ్చిమ కనుమల నుంచి పనాజీ గుండా ప్రవహించి చివరకు అరేబియా సముద్రంలో కలిసిపోతుందంట.
అయితే ఈ నది ఇలా ప్రయాణం చేసేప్పుడే వాటర్ ఫాల్స్ కూడా రూపుదిద్దుకుంటాయని సమాచారం.అయితే ఈ నది సృష్టించే ప్రకృతి అందాలను చూసేందుకు రెండు కళ్లు ఏ మాత్రం సరిపోవంట.
ఇంకా చెప్పాలంటే గోవా నుంచి బెంగళూరు వెళ్లే రైలు ప్రయాణంలో జలపాతాలు చూసేందుకు పెద్ద ఎత్తున జనాలు వస్తుంటారు.ఇక ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ జలపాతం ఉప్పొంగుతోంది.
కాగా ఈ జలపాతాల గురించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది ఇప్పుడు.తాజాగా కురుస్తున్న వానలకు ఈ జలపాతం పెద్ద ఎత్తున వస్తోంది.దీంతో గోవా నుంచి బెంగళూరుకు వెళ్తున్న రైలును మధ్యలోనే ఆపేయడంతో ఈ వీడియో కాస్తా ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.ఇక ఇప్పుడు ఈ జలపాతానికి సంబంధించిన వీడియో ఎందరిఇనో మెస్మరైజ్ చేస్తోంది.
ఇక నెట్టింట ఈ వీడియో చూసిన అందరూ ఎంతగానో మెచ్చుకుంటూ కామెంట్స్తో హోరెత్తిస్తున్నారు.అయితే మరి కొందరు మాత్రం ఇలాంటి డేర్ చేయొద్దని సూచిస్తున్నారు.