తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయిన ఈటీవీ లో ప్రసారమయ్యే “ఢీ” డాన్స్ కాంపిటీషన్ షో ద్వారా ప్రేక్షకులని బాగానే అలరించిన యాంకర్ “వర్షిణి” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.కాగా యాంకర్ వర్షిణి ఈ మధ్య పలు రకాల షోలు ఈవెంట్లలో నటిస్తూ బాగానే సంపాదిస్తోంది.
అయితే తాజాగా యాంకర్ వర్షిణి గురించి వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అయితే ఇంతకీ ఆ వార్త ఏమిటంటే తెలుగులో ప్రముఖ రియాల్టీ గేమ్ షో బిగ్ బాస్ విజయవంతంగా నాలుగు సీజన్లను పూర్తి చేసుకొని 5వ సీజన్ లోకి అడుగుపెడుతున్న సంగతి అందరికీ తెలిసిందే.
అయితే ఈ సీజన్లో యాంకర్ వర్షిణి కంటెస్టెంట్ గా పాల్గొనబోతున్నట్లు అంతేకాకుండా ఇప్పటికే బిగ్ బాస్ షోలో వర్షిణి ప్లేస్ కన్ఫర్మ్ అయినట్లు చర్చించుకుంటున్నారు.అయితే ఈ అమ్మడితో పాటు తెలుగు ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టులైన మామిళ్ల శైలజా ప్రియా, సురేఖ వాణి తదితరులు కూడా కంటెస్టెంట్లుగా పాల్గొనబోతున్నట్లు పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
కానీ ఇప్పటివరకు యాంకర్ వర్షిణి మాత్రం తాను బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొంటున్నట్లు వినిపిస్తున్న వార్తలపై స్పందించలేదు.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం యాంకర్ వర్షిణి మా టీవీ మరియు ఈ టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే పలు షోలలో యాంకరింగ్ నిర్వహిస్తోంది.అంతేకాకుండా హీరోయిన్ గా అవకాశాల కోసం కూడా బాగానే ప్రయత్నాలు చేస్తోంది.కాగా ఇటీవలే ఈ అమ్మడు టాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రంలో రెండో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చినప్పటికీ ప్రస్తుతం పలు అనివార్య కారణాల వల్ల ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు ఆగిపోయినట్లు సమాచారం.