టోక్యో ఒలింపిక్స్ లో తొలి పతకం సాధించి భారత శుభారంభం అదించిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చాను.రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నుంచి ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేంద్ర సింగ్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, దేశంలో ముఖులందరూ వెయిట్ లిఫ్టింగ్ లో రజత పతకం సాధించిన మీరాబాయ్ కు అభినందనలు తెలిపారు.
వివరాల్లోకి వెళితే ఒలంపిక్స్ విజయం సాధించి తిరిగి భారత్ చేరుకున్న మీరాబాయ్ కు ఘనస్వాగతం పలికింది భారత ప్రభుత్వం.విమానాశ్రయంలో ఆ రాష్ట్ర సీఎం స్వయంగా స్వాగతం పలికారు మీరాబాయ్ కి కోటి రూపాయల నజరానా అడిషనల్ ఎస్పీ గా ఉద్యోగం ఇస్తామంటూ మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బీరేంద్ర సింగ్ ప్రకటించారు.భారత ప్రజల మీరాబాయ్ పై ప్రశంసల జల్లులు కురుస్తూనే ఉన్నాయి ఇప్పటికి అనేక అవార్డులు నగదు పురస్కారాలను ప్రకటించారు.
జీవితాంతం పిజ్జా ను ఫ్రీగా ఇస్తాం అంటూ డోమినోస్ ప్రకటించింది.తాజాగా మణిపూర్ ప్రభుత్వం ఆమెకు 2 కోట్లతో పాటు అడిషనల్ ఎస్పీ గా మణిపూర్ ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.వివరాల్లోకి వెళితే ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ సాధించిన మీరాబాయి చానును అడిషనల్ ఎస్పీగా మణిపూర్ ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది.గురువారం స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆమెకు తోడుగా వెళ్లి ఆమె కార్యాలయంలో కూర్చోబెట్టారు.
మన మణిపూర్ రాష్ట్రంతో,పాటు దేశానికి మరిన్ని సేవలు అందించాలని అభినందనలు తెలిపారు.
.